Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరికి ముఖంపై జిడ్డు పేరుకుని అలంకరణ చేసుకున్న తక్కువ సమయంలోనే మళ్లీ నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యని ఇంట్లో లభించే కొన్నింటితో పరిష్కరించుకోవచ్చు.
- జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు మేకప్ వేసుకునే ముందు నీళ్లు కలిపిన నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోని పది నిమిషాలయ్యాక కడిగేయాలి. స్నానానికి పదిహేను నిమిషాల ముందు యాపిల్ను పలుచని స్లైసుల్లా కోసి ముఖంపైఉంచాలి. యాపిల్ స్లైసులు చర్మంలోని అధిక నూనెను పీల్చుకుంటాయి. ఫలితంగా ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
- అరకప్పు పెసరపిండిలో సరిపడా పెరుగు, కాస్త నీళ్లు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీటితో కడిగి నట్లయితే జిడ్డు చర్మం తాజాగా, తేటగా మారుతుంది. దీని తరవాత సబ్బు రుద్దుకోకూడదు. నాలుగైదు బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి ఆ మిశ్రమంలో కాస్త తేనె కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలయ్యాక కడిగేయాలి. జిడ్డు చర్మతత్వానికి మంచి ప్యాక్ ఇది.
- చెంచా పసుపులో కొన్ని పాలు పోసి...మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పూట ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది.
- జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి నిమ్మరసం చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసంలో కాసిన్ని నీళ్లు కలిపి అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. కాసేపు ఆ ఉండల్ని ఫ్రిజ్లో ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోయి శుభ్రపడుతుంది. తేమ అందుతుంది. జిడ్డు కూడా పేరుకోకుండా ఉంటుంది.
- జిడ్డు చర్మతత్వం ఉన్నవారు టొమాటో ముక్కతో ముఖంపై మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది. జిడ్డు తొలగిపోతుంది.