Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జామ పండు తింటే గ్యాస్ట్రిక్, అసిడిటీ వంటి పలు జీర్ణకోశ సమస్యలు, జలుబు దూరమవుతాయి. భోజనం తర్వాత ఒక జామ ముక్క తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మధుమేహులుసైతం నిరభ్యంతరంగా తినదగిన ఫలం. జామ చెట్టు బెరడు డికాక్షన్ తాగితే పొట్టలోని నులిపురుగులు, ఇతర సూక్ష్మజీవులు నశిస్తాయి.
- తరచూ జామకాయ తినేవారిలో చిగుళ్లు, దంతాలు బలోపేతమవుతాయి. జామలోని విటమిన్ సి వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం ఆగుతుంది. రోజూ రెండుమూడు లేత జామ ఆకులు నమిలితే నోటిదుర్వాసన తగ్గటమే గాక దంతాలు శుభ్రపడతాయి.
- తరచూ జామకాయ తినేవారికి మలబద్ధక సమస్య రాదు. ఈ సమస్య బాధితులు పండిన జామ పండ్ల ముక్కల మీద మిరియాల పొడి చల్లి, 4 చుక్కల నిమ్మరసం పిండి తింటే ఎంతటి మలబద్దకమైనా వదిలిపోవాల్సిందే. దీనితో బాటు అతిసార, జిగట విరేచనాలు, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, గర్భిణుల్లో వాంతులకు జామ మంచి ఔషధంగా పనిచేస్తుంది.
- శారీరక బలహీనత ఉన్నవారు పండిన జామలోని గింజలు తీసి ఆ గుజ్జును పాలు, తేనెతో కలిపి తీసుకొంటే తగినంత విటమిన్ సి, క్యాల్షియం లభించి శారీరక దృఢత్వం చేకూరుతుంది.
- ఎదిగేవయసు పిల్లలు, గర్భిణుల ఆరోగ్యానికీ ఇది ఎంతగానో దోహదం చేసుంది. అలాగే.. క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హైపటైటీస్, జీర్ణాశయపు అల్సర్లు, మూత్రంలో మంట వంటి సమస్యలున్న వారికి సైతం పండిన జామ గుజ్జు ఔషధంగా పనిచేస్తుంది.
- రోజూ కనీసం ఒక ముక్క దోర జామకాయ తింటే రక్తపోటు అదుపులో ఉండటమే గాక ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.
- కాలిన గాయాలకు జామ గుజ్జును రాస్తే త్వరగా మానటమే గాక మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.