Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక గ్రాము వెల్లుల్లిని మెత్తగా నూరి కప్పు మజ్జిగలో కలిపి రోజూ మూడు పూటలా తాగుతుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది. వెల్లుల్లి వాసన గిట్టని వారు నెయ్యిలో దోరగా వేయించి వాడుకోవచ్చు.
- సర్పగంధ పౌడరును (మూలికల షాపుల్లో దొరుకుతుంది) అర టీ స్పూన్ చొప్పున రోజుకి మూడు సార్లు నీటితో కలిపి ఇస్తుండాలి.
- ఆయుర్వేద షాపుల్లో దొరికే క్షీరబలతైలం (వందసార్లు కాచి తయారు చేసింది) రోజూ ఉదయం 5 చుక్కలు కప్పు పాలల్లో కలిపి తాగుతుండాలి.
- ఒక టీ స్పూన్ ఉసిరికాయ రసాన్ని ఒక టీ స్పూన్ తేనెతో కలిపి రోజూ ఉదయాన్నే తాగుతుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది.
- తరచుగా నల్లద్రాక్ష పండ్లుగాని, రసాన్ని గాని తీసుకుంటుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది.
- బంగాళాదుంపలు పై చర్మంతో పాటు బాగా ఉడికించి తినడం వల్ల వ్యాధిని నియంత్రించవచ్చు.
- మందార పువ్వులను ఎండపెట్టి పొడిగా నలిపి పాలతో టీగా కాచాలి. దీన్ని రోజుకి 2-3 సార్లు ప్రతి రోజు తాగుతుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది.
- దాల్చిన పౌడరును కూరల్లో, వేపుళ్లు, టిఫిన్లలో, కాఫీలో చల్లుకొని వాడటం వల్ల కూడా బి.పి.ని అదుపు చేయొచ్చు.
- ప్రతి రోజూ టీలో యాలకుల చూర్ణం కలిపి తాగాలి. ఈ అలవాటు వల్ల బి.పి. త్వరగా కంట్రోల్లోకి వస్తుంది.
- చారెడు ధనియాలు దంచి వెడల్పు స్టీలు గిన్నెలో పోసి అందులో నీటిని కలపాలి. దీన్ని ఫ్రిజ్లో రాత్రంతా పెట్టి ఉదయాన్నే వడబోసి చక్కెర కలిపి తాగితే (చక్కర వ్యాధి లేనివారు) వారంలోనే వ్యాధి అదుపులోకి వస్తుంది.