Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడూ టెలీవిజన్, కంప్యూటర్ మానిటర్ చూస్తూండడం, స్మార్ట్ఫోన్ వాడకం బాగా పెరగడం వల్ల కళ్ళు పొడిబారి మంట, దురదగా అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఎలాక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు కాస్త దూరంగా ఉండాలి అని చెప్పడం సులువే కాని .. అలా కుదరనప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు అవసరం అంటున్నారు కంటి నిపుణులు.
కళ్ళకు మధ్యమధ్యలో విశ్రాంతి కలిగించాలి. ఆల్మండ్ ఆయిల్ కాని విటమిన్ ఇ ఆయిల్గానీ కంటిచుట్టూ రాయాలి.
కళ్లు తడి ఆరిపోకుండా చుట్టూ కొబ్బరినూనె పూస్తే మంచిది.
దూది పింజల్ని చల్లని నీళ్లలో తడిపి తరచూ తుడవడం వల్ల కళ్ళు తడి ఆరిపోకుండా ఉంటాయి.
చిక్కటి స్వచ్ఛమైన పాలలో దూదిని ముంచి కళ్ళచుట్టూ సున్నితంగా రాస్తే చర్మానికి తగినంత తేమ అందుతుంది.
కీరా, ఆలు ముక్కలని కళ్ళపై కాసేపు పెట్టుకుని సేదతీరవచ్చు.
ఐస్ముక్కతో కళ్ళ చుట్టూ తుడిస్తే కళ్ళకింద నల్లనిచారలు, ముడతలు ఇట్టే మాయమవుతాయి.