Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరంలోని జీవక్రియలన్నీ సజావుగా జరగాలంటే పోషకాహారం అవసరం. ఆహారం ద్వారా అందే పలు ప్రధాన పోషకాలలో కాల్షియం కూడా ఒకటి. ఎముకలు, దంతాలు పుష్టిగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో సరిపడా కాల్షియం ఉండాల్సిందే. శరీరపు కదలికలకు మూలమైన కండరాల సంకోచ వ్యాకోచాలలోనూ దీని పాత్ర ఎంతో కీలకం. రుతు సమస్యల పరిష్కారంలో కాల్షియం మెరుగైన రీతిలో సాయపడుతుంది. కాల్షియం లోపం పెద్దలలో రక్తపోటు పెరిగేందుకు కారణమవుతుండగా చిన్నారుల్లో ఎదుగుదల లోపాలకు కారణమవుతోంది.
- శరీర అవసరాలకు సరిపడా కాల్షియాన్ని ఆహారం రూపంలో రోజూ అందించాలి. లేకుంటే ఆ అవసరాలకు సమానమైన మొత్తం కాల్షియాన్ని శరీరం ఎముకల నుంచి గ్రహిస్తుంది, దీంతో ఎముకలు గుల్లబారటం జరుగుతుంది. కాల్షియం లోపం ఎముకల మీద ఆధారపడిన జీవక్రియలను దెబ్బతీయటంతోపాటు మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో పలు ఇతర ఇబ్బందులకు కారణమయ్యే ప్రమాదం ఉంది.
- రోజూ ఆహారం రూపంలో తగినంత కాల్షియం తీసుకోవటంతో పాటు దాన్ని శరీరం స్వీకరించేందుకు అవసరమయ్యే విటమిన్ డి కూడా తీసుకోవాలి. రోజూ సాయంకాలపు ఎండలో వ్యాయామం చేయటం వల్ల కూడా తగినంత డి విటమిన్ లభిస్తుంది. అప్పుడే ఎముకలు మరింత బలంగా తయారవుతాయి. చిన్నారుల విషయంలో కేవలం పాలతో సరిపెట్టకుండా పండ్లు, కూరగాయలు, గుడ్లు కూడా వారికి అందేలా చూడాలి.
- వయస్సు పెరిగే కొద్ది తీసుకునే ఆహార పరిమాణం కూడా తగ్గుతుంది. కాబట్టి సహజంగానే దాని ద్వారా అందే కాల్షియం కూడా తగ్గుతుంది. ఈ లోటును భర్తీ చేయటానికి కాల్షియం టాబ్లెట్లు ఉపయోగపడతాయి. సమీకత ఆహారం తీసుకోవడం ద్వారా సమస్యలన్నీ దూరమవుతాయి.స