Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయం
బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఎంపీ రిషి సునక్
బ్రిటన్లో ముగ్గురు భారత సంతతి పార్లమెంటు సభ్యులు కీలక మంత్రి పదవుల్లో నియమితులయ్యారు. ఐటీ దిగ్గజం 'ఇన్ఫోసిస్' వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు, ఎంపీ రిషి సునక్ను ప్రధాని బోరిస్ జాన్సన్ 2020 ఫిబ్రవరి 13న ఆర్థిక మంత్రిగా నియమిం చారు. ఆయనతో పాటు అలోక్శర్మ(52), సుయెల్లా బ్రేవర్మన్ (39)లనూ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్ప టికే హౌంమంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ కొనసాగుతున్నారు. అలోక్శర్మ వాణిజ్య, ఇంధన, పారిశ్రామిక శాఖల మంత్రిగా, సుయెల్లా అటార్నీ జనరల్గా నియమితులయ్యారు.
కరోనా వైరస్ కొత్తపేరు 'కొవిడ్-19'
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్కు 'కొవిడ్-19'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(ఔనఉ) నామకరణం చేసింది. కరోనా వైరస్వ్యాధి(ణ) అనే పదాలకు సంక్షిప్త రూపంగా ఈ పేరును ఖరారు చేసింది. 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్లో తొలిసారిగా ఈ వైరస్ ఉనికి బయటపడింది. కరోనా వైరస్కు టీకాను అభివద్ధి చేసే దిశగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. వీరికి భారత సంతతి శాస్త్రవేత్త ఎస్.ఎస్.వాసన్ నాయకత్వం వహిస్తున్నారు.
జాతీయం
ఈ నెల 15 నుంచి 29 వరకు ఉచితంగా ఫాస్టాగ్
జాతీయ రహదా రులపై ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్ లను ఉచితంగా పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. 2020 ఫిబ్రవరి 15 నుంచి 29 వరకు వీటిని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కు చెందిన టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్ పంపుల వద్ద ఉచితంగానే వాహనదారులు పొంద వచ్చని తెలిపింది. రూ.100 రుసుమును వసూలు చేయబో మని కేంద్ర రవాణా, రహదారుల శాఖ వెల్లడించింది. ఫాస్టాగ్ వ్యాలెట్కు వర్తించే సెక్యూరిటీ డిపాజిట్, కనీస బ్యాలెన్స్ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.
అసోం ఎన్నార్సీ డేటా భద్రం : కేంద్ర హౌంశాఖ
అసోంలో జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) డేటా భద్రంగానే ఉందని కేంద్ర హౌంశాఖ 2020 ఫిబ్రవరి 12న స్పష్టం చేసింది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని, త్వరలోనే ఇవి పరిష్కారమవుతాయని పేర్కొంది. అధికారిక వెబ్సైట్లో కొద్ది రోజులుగా ఎన్నార్సీ వివరాలు కనిపించట్లేదు. దీంతో డేటా పోయిందని, వాటిలో మార్పులు చేస్తున్నారని ప్రజల్లో ఆందోళన వ్యక్తమయింది.
వంటగ్యాస్ ధర రూ.917.50
సబ్సిడీ వెసులుబాటు లేని గహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరను రూ.917.50గా కేంద్రం ప్రకటించింది. జనవరిలో రూ.769గా ఉన్న సిలిండర్ ధరపై తాజాగా రూ.148.50 భారం మోపింది. అర్హులకు రాయితీని రూ.204 నుంచి రూ.341.95కు పెంచింది. అంతర్జాతీయ మార్కెట్టులో గ్యాస్, చమురు ధరల ఆధారంగా ప్రతి నెలా ఒకటో తేదీన వాటి ధరలను కేంద్రం నిర్ణయిస్తుంది.
సుష్మాస్వరాజ్ భవన్గా ప్రవాసీ భారతీయ కేంద్రం
రెండు ప్రముఖ సంస్థలకు దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని సుష్మాస్వరాజ్ భవన్గా, ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ను సుష్మాస్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్గా పిలుస్తారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు.
వివాద్ సే విశ్వాస్ పథకం పరిధి విస్తరణ
ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన 'వివాద్ సే విశ్వాస్' పథకం పరిధిని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 'వివాద్ సే విశ్వాస్ సవరణ బిల్లు'కు కేంద్ర కేబినెట్ 2020 ఫిబ్రవరి 12న ఆమోదం తెలిపింది.
ఎన్నికల్లో బ్లాక్చైన్ వ్యవస్థ : సునీల్ అరోరా
ఎన్నికల్లో బ్లాక్చైన్ వ్యవ స్థను ప్రవేశ పెట్టేందుకు ఐఐటీ మద్రాస్తో కలసి పనిచేస్తున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఢిల్లీలో 2020 ఫిబ్రవరి 12న జరిగిన 'టైమ్స్ నౌ సమిట్' కార్యక్రమంలో పాల్గొని ఈ మేరకు వెల్లడించారు. బ్లాక్చైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఒక ఓటర్ వేరే రాష్ట్రంలో ఉండి కూడా తమ రాష్ట్రంలోని ఎన్నికల్లో ఓటేయవచ్చని పేర్కొన్నారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విజయం సాధించింది. 2020 ఫిబ్రవరి 11న వెల్లడైన ఫలితాల్లో 70కి గాను 62 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలు పొందారు. దీంతో వరసగా మూడుసార్లు అధికారం చేపట్టి, హ్యాట్రిక్ సాధించిన పార్టీగా ఆప్ నిలిచింది. తొమ్మిది నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని ఏడు సీట్లనూ బీజేపీ సొంతం చేసుకున్నా, శాసనసభ వద్దకు వచ్చేసరికి ఆప్ ముందు నిలవలేక పోయింది. బీజేపీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాలకు పరిమితం కాగా ఈసారి 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ మాత్రం అత్యధిక చోట్ల ధరావతునైనా దక్కించుకోలేకపోయింది. వరసగా రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కలేదు.
ఏపీలో తొలి దిశ మహిళా పోలీస్స్టేషన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో తొలి 'దిశ' మహిళా పోలీస్స్టేషన్ ప్రారం భమైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన తొలి దిశ పోలీస్ స్టేషన్ను ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 ఫిబ్రవరి 8న ప్రారంభించారు. అనంతరం నన్నయ వర్సిటీలో 'దిశ' చట్టంపై పోలీసు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఏర్పాటు చేసిన వర్క్షాప్లో పాల్గొని 'దిశ యాప్'ను ఆవిష్కరించారు.
ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు : సుప్రీం
పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదని తెలిపింది. ''సుప్రీంకోర్టు అమలు చేస్తున్న చట్టం ప్రకారం.. రిజర్వేషన్లు కల్పించాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందే ప్రాథమిక హక్కు ఏ వ్యక్తికీ సంప్రాప్తించలేదు. రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వా లను న్యాయస్థానాలు ఆదేశించలేవు'' అని జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పబ్లిక్ సర్వీసు ఉద్యోగాల్లో ఎస్.సి., ఎస్టీలకు పదోన్నతులు ఇవ్వకూడదంటూ 2012 సెప్టెంబరు 5న ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సవాలు చేస్తూ అక్కడి హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయగా, న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వును కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పై తీర్పు ఇచ్చింది.
ఎస్సీ-ఎస్టీ చట్ట సవరణకు రాజ్యాంగ బద్ధత : సుప్రీంకోర్టు
ఎస్సీ-ఎస్టీ చట్టానికి 2018లో కేంద్రం తీసుకువచ్చిన సవరణ సబబేనని సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరి 10న సమర్థించింది. ఇది రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చని తెలి పింది. కేసు నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ గానీ, సీనియర్ పోలీసు అధికారి సమ్మతి గానీ అవసరం లేదని జస్టిస్ అరుణ్ మిశ్ర నేతత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కఠిన నిబంధనలను సరళతరం చేస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రభావం లేకుండా చేయడానికి ఎస్సీ-ఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణను సవాల్ చేస్తూ పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీనిపై న్యాయస్థానం తీర్పు వెలువడింది.
అకాంకాగ్వాను అధిరోహించిన చిన్న వయస్కురాలు
ముంబైలోని నావికాదళ స్కూల్ విద్యార్థిని, 12 ఏళ్ల కామ్య కార్తికేయన్ దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ అకాం కాగ్వా (6,962మీ) ను 2020 ఫిబ్రవరి 1న విజయవంతంగా అధిరోహించింది. దీంతో అకాంకాగ్వా పర్వతాన్ని అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలిగా కామ్య ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 7వ తరగతి చదువుతున్న కామ్య అకాంకాగ్వా పర్వత శిఖరాగ్రంపై భారత జాతీయ పతకాన్ని ఎగరవేసిందని నేవీ అధికారులు వెల్లడించారు. అకాంకాగ్వా పర్వతం అర్జెంటీనాలో ఉంది.
'భారత్లో బాల్య వివాహాల నిర్మూలన' అధ్యయన నివేదిక
దేశంలో బాల్యవివాహాలను నివారించడానికి ఇంకా పటిష్ఠ చర్యలు చేపట్టాలని 'భారత్లో బాల్య వివాహాల నిర్మూలన' అధ్యయన నివేదికలో యూనిసెఫ్ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ భర్తల ఎంపికలో ఇప్పటికీ ఆడ పిల్లలకు పూర్తిస్థాయి స్వేచ్ఛ లేదని తెలిపింది.
ఢిల్లీ ఎమ్మెల్యేల్లో సగం మందిపై తీవ్ర నేరాల కేసులు
కొత్తగా ఢిల్లీ శాసనసభకు ఎన్నికైన 70 మంది శాసనసభ్యుల్లో హత్యాయత్నాలు, అత్యాచారాల వంటి తీవ్ర నేరారోపణలతో కేసులు ఎదుర్కొంటున్నవారు 37 మంది ఉన్నారని ప్రజా స్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) 2020 ఫిబ్రవరి 12న వెల్లడించింది. మొత్తంమీద 43 మందిపై కేసులున్నాయి.
సీఏఏకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ పుస్తకం
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరే కంగా పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతాబెనర్జీ 'నాగరికట్ట ఆతంకో'(పౌరసత్వ భయం) పేరుతో ఓ పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని అంతర్జాతీయ కోల్కతా పుస్తక ప్రదర్శనలో 2020 ఫిబ్రవరి 4న అమ్మకానికి ఉంచారు. ఈ పుస్తకంలో రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో భారత్లో అనిశ్చితి గురించి మమతా రాశారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ వ్యతిరేక ఉద్యమం, తాజా రాజకీయాలపై తన అభిప్రాయాలను విశదీకరించారు.
ప్రాంతీయం
తుపాకులగూడెం బ్యారేజీ పేరు మార్పు
గోదావరి నదిపై నిర్మితమవు తున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలం గాణ ఆదివాసీ వనదేవత 'సమ్మక్క' పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు.
మొక్కల పెంపకంలో తెలంగాణకు తొలి ర్యాంక్
2017-18లో 4,89,673 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తొలి ర్యాంక్ను కైవసం చేసుకుంది. 3,82,364 హెక్టార్లలో మొక్కలు నాటిన ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని 2020 ఫిబ్రవరి 10న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో వెల్లడించారు. 2016-17లో 4,38,059 హెక్టార్లలో, 2015-16లో 2,36,598 హెక్టార్ల లో మొక్కలు నాటి తొలి స్థానాన్ని సాధించింది.
గోవింద్పూర్లో హట్సన్ ఐస్క్రీమ్ ప్లాంట్
చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్... తెలంగాణలో అతిపెద్ద ఐస్క్రీమ్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. రూ.207 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లాలోని గోవింద్పూర్లో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు 2020 ఫిబ్రవరి 12న కంపెనీ తెలిపింది.
ఒక మున్సిపాలిటీకి ఒకే బ్యాంకు ఖాతా
తెలంగాణలో రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు విధిగా ఒకే ఒక బ్యాంకు ఖాతాను నిర్వహించాలని పురపాలకశాఖ ఆదేశించింది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు ఆర్థిక వ్యవహారాలను ఒకే బ్యాంకు ఖాతా ద్వారా నిర్వహించాలని స్పష్టం చేసింది. పట్టణ, స్థానిక సంస్థల నిధులకు సంబంధించిన బ్యాంకు ఖాతా షెడ్యుల్డు కమర్షియల్ బ్యాంకులో మాత్రమే ఉండాలని పేర్కొంది. ప్రతి పురపాలక సంఘం లేదా కార్పొరేషన్ పేరుతో బ్యాంకు ఖాతా నిర్వహించాలని సూచించింది.
ఐదుగురు సమాచార హక్కు చట్టం కమిషనర్లు
తెలంగాణ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషన్లో ఐదుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 10న ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్లు నిండే వరకు పదవుల్లో కొనసాగుతారని ప్రభుత్వం వెల్లడించింది. నమస్తే తెలంగాణ సంపాదకుడు కట్టా శేఖర్రెడ్డి, టీన్యూస్ టీవీ ఛానల్ సీఈవో ఎం.నారాయణ రెడ్డి, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్లా, మహమ్మద్ అమీర్, గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గుగులోతు శంకర్నాయక్ ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీఐ కమిషన్కు చీఫ్ కమిషనర్గా రాజాసదారాం, సభ్యుడిగా బుద్ధా మురళి కొనసాగుతున్నారు. వీరితో కలిపి మొత్తం సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది.
రామగుండం ఎన్టీపీసీకి జాతీయ అవార్డు
ఎన్టీపీసీ 17వ జాతీయస్థాయి ప్రొఫెషనల్ సర్కిల్ సదస్సు-2020లో ఎన్టీపీసీ రామగుండం సంస్థకు చెందిన సంకల్ప్ జట్టు ద్వితీయ అవార్డు అందుకుంది. మధ్యప్రదేశ్లోని ఎన్టీపీసీ ఖర్గోన్లో 2రోజుల పాటు జరిగిన ప్రొఫెషనల్ సర్కిల్ సదస్సులో 16 జట్లు పాల్గొన్నాయి. ఉపరు(ఎన్టీపీసీ ఖర్గోన్) జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఎన్టీపీసీ రామగుండం జట్టు బెస్ట్ సదరన్ రీజియన్ అవార్డు సొంతం చేసుకుంది.
తొలి సహజ సిద్ధ మురుగునీటి శుద్ధి కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలో తొలి సహజసిద్ధ మురుగునీటి శుద్ధి కేంద్రం హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్సీఐ) కార్యాలయంలో ఏర్పాటైంది. ఫైటోరిడ్ స్వాబ్ (మొక్కల ఆధారంగా మురుగును స్వచ్ఛంగా మార్చే ప్రక్రియ) ఆధారిత కేంద్రాన్ని ఏఆర్సీఐ కార్యాలయంలో ఆ సంస్థ డైరెక్టర్ డా.జి.పద్మనాభం 2020 ఫిబ్రవరి 11న ప్రారంభించారు.
మల్లారెడ్డి, టెక్ మహీంద్రా వర్సిటీలకు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో మల్లారెడ్డి మహిళా వర్సిటీ, టెక్ మహీంద్రా విశ్వవిద్యాలయం ఉన్నాయి. జీడిమెట్ల సమీపంలోని మైసమ్మగూడలో మల్లారెడ్డి మహిళావర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. దుండిగల్లో గత కొన్నేళ్లుగా టెక్ మహీంద్రా సంస్థ ఇంజినీరింగ్ కోర్సులను అందిస్తోంది. అది కూడా ప్రైవేటు వర్సిటీగా మారనుంది.
వార్తల్లో వ్యక్తులు
ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సాల్
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు సీఎండీగా సీనియర్ ప్రభుత్వ అధికారి రాజీవ్ బన్సాల్ను కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 13న నియమించింది. నాగాలాండ్ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ బన్సాల్.. గతంలో విజయవంతంగా సంస్థను నడిపించారు. 2017లో మూడు నెలలపాటు మధ్యంతర ఎయిర్ ఇండియా సీఎండీగా సేవలందించారు.
మిధాని సీఎండీగా సంజరుకుమార్ ఝా
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కొన సాగుతున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మిశ్రధాతు నిగం లిమిటెడ్(మిధాని) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా సంజరుకుమార్ ఝా నియమితుల య్యారు. ఇందుకు కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ 2020 ఫిబ్రవరి 12న ఆమోదముద్ర వేసింది. సంజరుకుమార్ ఝా 2020 మే 1న బాధ్యతలను చేపడతారు. 2024లో పదవీ విరమణ చేసేంత వరకూ సంబంధిత పదవిలోనే కొనసాగుతారు.
పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఈడీగా అనూప్ కుమార్
ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ భారత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)గా అనూప్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సదరన్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్-1(ఎస్ఆర్టీఎస్-1)కు అనూప్కుమార్ను నియ మించగా... ఈ రీజియన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలోని కొంత భాగం ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
ఈఎన్సీ ఫ్లీట్ కమాండర్గా సంజయ వాత్సాయన్
తూర్పు నావికాదళం (జుచీజ) ఫ్లీట్ కమాండర్గా రియర్ అడ్మిరల్ సంజరు వాత్సాయన్ నియమితులయ్యారు. 2020 ఫిబ్రవరి 10వ రియర్ అడ్మిరల్ సూరజ్ బెర్రీ నుంచి సంజరు వాత్సాయన్ బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్ జయచంద్రారెడ్డి కన్నుమూత
సుప్రీంకోర్డు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ కె.జయచంద్రారెడ్డి (94) 2020 ఫిబ్రవరి 9న బెంగళూరులో మతి చెందారు. మారుమూల ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మేధావిగా జయచంద్రారెడ్డి పేరొందారు. ఆయన కడప జిల్లాలో జన్మించారు. హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా సేవలం దించారు. ఆపై హైకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. 14వ లా కమిషన్ అధ్యక్షు డిగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా జయచంద్రారెడ్డి సేవలందించారు. అంతర్జాతీయ న్యాయ స్థానంలో నిపుణుల (ఎక్స్పర్ట్స్) బంద సభ్యుడిగా ఉన్నారు.
పర్యావరణవేత్త ఆర్.కె.పచౌరి కన్నుమూత
ప్రముఖ పర్యావరణవేత్త, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి) మాజీ అధినేత ఆర్.కె.పచౌరి(79) 2020 ఫిబ్రవరి 13న దిల్లీలో మృతి చెందారు. 2007లో వాతావరణ మార్పులకు సంబంధించి ఐరాస ఇంటర్-గవర్న్మెంటల్ ప్యానెల్(ఐపీసీసీ) అధ్యక్షుడిగా... అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోర్తో కలిసి ఆర్.కె.పచౌరి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 2001లో పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి.
అవార్డులు
ఆస్కార్ అవార్డులు 2020
దక్షిణ కొరియా చిత్రం 'పారసైట్' 2020 ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఫిబ్రవరి 10న లాస్ ఏంజెల్స్లో జరిగిన ఆస్కార్ పురస్కార వేడుకల్లో 'పారసైట్' కొత్త చరిత్ర లిఖించింది. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి ఆంగ్లేతర చిత్రంగా నిలిచింది. ఉత్తమ అంత ర్జాతీయ చిత్రం, ఉత్తమ స్క్రీన్ప్లే సహా 4 పుర స్కారాలను అందుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన బాంగ్ జూన్ హొ ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా నిలిచారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన జోకర్ పాత్ర ఆధారంగా రూపొందిన 'జోకర్' చిత్రం ఆస్కార్ పురస్కారాల్లో మెరిసింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జోక్విన్ ఫోనిక్స్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. 'జూడీ' చిత్రానికిగానూ రెనీ జెల్వెగర్ ఉత్తమ నటిగా నిలిచారు. 'ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' చిత్రంతో ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ ఉత్తమ సహాయ నటుడిగా, 'మ్యారేజ్ స్టోరీ' చిత్రంతో లారా డెర్న్ ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు.
డాక్టర్ కార్ల్ జూన్కు జినోమ్ వ్యాలీ అవార్డు
కేన్సర్ మహమ్మారికి వినూత్న చికిత్సను అందుబాటులోకి తెచ్చిన అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ కార్ల్ హెచ్. జూన్కు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ-2020 అవార్డు అందించనున్నట్లు బయో ఆసియా నిర్వాహకులు ప్రకటిం చారు. కార్ల్ జూన్తో పాటు ప్రజారోగ్య రంగంలో విశేష కషి చేసిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్లకు కూడా ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపారు. ఫార్మా రంగంతోపాటు, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను విస్తతంగా చర్చించే బయో ఆసియా ఆయా రంగాల్లో విశిష్ట కషి చేసిన వారికి జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులు అందిస్తోంది.
ఆర్థికాంశాలు
ప్రపంచ వద్ధి అంచనాలు 2.2 శాతానికి కుదింపు
2020లో ప్రపంచ వద్ధి రేటు అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి కుదిస్తున్నట్లు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) వెల్లడించింది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. 'చైనాలో బైటపడిన కోవిడ్-19(కరోనా) వైరస్ ప్రపంచ ఎకానమీకి ముప్పుగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే వద్ధి అంచనాలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది' అని ఈఐయూ తన నివేదికలో పేర్కొంది.
భారత జీడీపీ వద్ధి రేటు 6 శాతం: ఎస్అండ్పీ
2020-2021లో భారతదేశ వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని గ్లోబల్ దిగ్గజ రేటింగ్ సంస్థ- స్టాండెర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) అంచనా వేసింది. 2021-2022లో ఈ రేటు 7 శాతానికి, అటుపై ఆర్థిక సంవత్సరం 7.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ అంచనాల నేపథ్యంలో దీర్ఘకాలికంగా భారత్ సార్వభౌమ రేటింగ్ను స్టేబుల్ అవుట్లుక్తో 'బీబీబీ-'గా కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ స్పష్టం చేసింది. ఈ మేరకు 2020 ఫిబ్రవరి 13న ప్రకటన విడుదల చేసింది. ఒక కంపెనీ లేక దేశం తన ద్రవ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలదని 'బీబీబీ' రేటింగ్ సూచిస్తుంది.
సైన్స్ AND టెక్నాలజీ
గగన్యాన్ వ్యోమగాములకు శిక్షణ ప్రారంభం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మానవ సహిత అంతరిక్ష ప్రయోగం 'గగన్యాన్' లో పాల్గొనబోయే నలుగురు భారతీయ వ్యోమ గాములకు శిక్షణ ప్రారంభమైంది. రష్యా రాజధాని మాస్కోలోని 'గగరీన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్(జీసీటీసీ)'లో 2020 ఫిబ్రవరి 10న ఈ నలుగురికి శిక్షణ మొదలైనట్లు రష్యాకు చెందిన శిక్షణ సంస్థ గ్లావ్కాస్మోస్ వెల్లడించింది. ఏడాదిపాటు వీరికి భౌతిక శిక్షణతోపాటు బయోమెడికల్ రంగంలోనూ శిక్షణ ఉంటుంది.
వాట్సప్ వినియోగదార్లు 200 కోట్లు
వాట్సప్ వినియోగదార్ల సంఖ్య ప్రపంచ జనాభాలో 200 కోట్లకు చేరింది. 2018 ఫిబ్రవరిలో వాట్సప్కు 150 కోట్ల మంది యాక్టివ్ వినియోగదార్లున్నారని, వీరంతా కలిపి రోజుకు సుమారు 6000 కోట్ల సందేశాలు పంపుకుంటున్నట్లు వాట్సప్ మాతసంస్థ ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వెల్లడించారు. వాట్సప్కు అతిపెద్ద మార్కెట్గా భారత్ గుర్తింపు తెచ్చుకొంది. 2019 జులైలో సుమారు 40 కోట్ల మందికి పైగా దేశీయంగా వాట్సాప్ వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
అధునాతన క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్
ఇరాన్ సైన్యంలోని సుశిక్షిత రివల్యూషనరీ గార్డ్స్ దళం 2020 ఫిబ్రవరి 9న ఒక అధునాతన బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించింది. ఇందులో కొత్త తరం ఇంజిన్లు ఉన్నాయని, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు దీన్ని రూపొందించామని ఆ దళం తెలిపింది. రాద్-500 అనే ఈ క్షిపణిలో జొహెయిర్ ఇంజిన్ ఉందని పేర్కొంది. మిశ్రమ పదార్థాలతో ఇది తయారైందని, ఉక్కుతో రూపొందిన ఇతర ఇంజిన్ల కన్నా తేలిగ్గా ఉంటుందని వివరించింది.
ఈ ప్లూటో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ
ప్యూర్ ఈవీ అనే సంస్థ ఐఐటీ-హైదరాబాద్ సాయంతో అభివద్ధి చేసిన 'ఈ ప్లూటో 7జీ' ఎలక్ట్రిక్ స్కూటర్ను నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ డెరె ౖక్టర్ డాక్టర్ వి.కె.సారస్వత్, ,చైర్మన్ డాక్టర్ జి.సతీశ్రెడ్డి హైదరాబాద్లో 2020 ఫిబ్రవరి 9న ఆవిష్కరించారు.
అంతరిక్షంలోకి సోలార్ ఆర్బిటర్ నౌక
అంతరిక్ష చరిత్రలోనే తొలిసారిగా సూర్యుడి ధవాల చిత్రాలను మనకు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, యురోపి యన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లు సంయుక్తంగా తయారు చేసిన 'సోలార్ ఆర్బిటర్' అంతరిక్ష నౌక ఫిబ్రవరి 10న నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు రూ.10 వేల కోట్ల ఖర్చుతో రూపొందించిన ఈ అంతరిక్ష నౌకను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవరల్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి అలియన్స్ అట్లాస్-వీ రాకెట్ సాయంతో నింగిలోకి పంపారు.
క్రీడలు
యూఏఈ క్రికెట్ డెరైక్టర్గా రాబిన్సింగ్
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) క్రికెట్ డెరైక్టర్గా భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ రాబిన్సింగ్ నియమితులయ్యారు. ప్రధాన కోచ్ డగ్ బ్రౌన్ను ఆ పదవి నుంచి తొలగించిన యూఏఈ క్రికెట్ రాబిన్సింగ్కు బాధ్యతలు అప్పగించింది.
ఐసీసీ టోర్నీలో తొలి మహిళా రిఫరీగా జి.ఎస్.లక్ష్మి
2019, డిసెంబర్లో పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన తొలి మహిళగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ మాజీ క్రికెటర్ గండికోట సర్వ (జీఎస్) లక్ష్మి మరో ఘనతను సాధించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ స్థాయి టోర్నీలో తొలి మహిళా మ్యాచ్ రిఫరీగా ఆమె వ్యవహరించనున్నారు. రాజమహేంద్రవరంకు చెందిన 51 ఏళ్ల జీఎస్ లక్ష్మి 2020, ఫిబ్రవరి 21న ఆస్ట్రేలియాలో మొదలుకానున్న మహిళల టి20 వరల్డ్ కప్లో మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మెగా టోర్నీకి మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించే ముగ్గురిలో ఏకైక మహిళ జీఎస్ లక్ష్మినే. లక్ష్మితోపాటు స్టీవ్ బెర్నార్డ్, క్రిస్ బ్రాడ్లను మ్యాచ్ రిఫరీలుగా ఐసీసీ నియమించింది.
ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ విజేత బెంగళూరు రాప్టర్స్
ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్(ూదీూ)లో బెంగళూరు రాప్టర్స్ టైటిల్ నిలబెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా అయిదో సీజన్ బరిలో దిగిన ఆ జట్టు విజేతగా నిలిచింది. 2020 ఫిబ్రవరి 9న జరిగిన ఫైనల్లో బెంగళూరు రాప్టర్స్ 4-2 తేడాతో నార్త్ఈస్టర్న్ వారియర్స్పై గెలిచింది.
అండర్-19 ప్రపంచకప్ విజేత బంగ్లాదేశ్
ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2020 విజేతగా బంగ్లాదేశ్ జట్టు నిలిచింది. దక్షిణాఫ్రికాలోని పాచెఫ్స్ట్రూమ్లో 2020 ఫిబ్రవరి 9న జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ భారత్పై విజయం సాధించింది.
పుల్లెల గోపీచంద్కు ఐఓసీ జీవిత సాఫల్య పురస్కారం
భారత బ్యాడ్మింటన్కు కోచ్గా విశేష సేవలందిస్తోన్న జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, తెలుగు తేజం పుల్లెల గోపీచంద్కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. కోచ్ల విభాగంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జీవిత సాఫల్య పురస్కారానికి గోపీచంద్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ ప్రకటించింది.
లాల్రెమ్సియామికి వర్ధమాన క్రీడాకారిణి అవార్డు
భారత మహిళా హాకీ ప్లేయర్ లాల్రెమ్సియామికి అంతర్జాతీయ హాకీ సంఘం(ఎఫ్ఐహెచ్) 2019 వర్ధమాన క్రీడాకారిణి అవార్డు లభించింది. మొత్తం ఓట్లలో 40 శాతం దక్కించుకున్న 19 ఏళ్ల సియామి.. జులీటా (అర్జెంటీనా), మాల్టా (నెదర్లాండ్స్)లను వెనక్కి నెట్టి ఈ పురస్కారాన్ని సాధించింది. పురుషుల హాకీలో 2019 ఏడాది వర్ధమన ఆటగాడి(రైజింగ్ స్టార్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్)గా వివేక్ సాగర్ ప్రసాద్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం పోటీపడిన వారిలో 19 ఏళ్ల వివేక్ విజేతగా నిలవగా... మైకో కాసెలా (అర్జెంటీనా), బ్లేక్ గోవర్స్ (ఆస్ట్రేలియా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ఖేలో ఇండియా ఐస్ హాకీ ఛాంపియన్షిప్
మొట్టమొదటి ఖేలో ఇండియా ఐస్ హాకీ ఛాంపియన్షిప్ను లడఖ్ స్కౌట్స్ జట్టు గెలుచుకుంది. 2020 ఫిబ్రవరి 9న జరిగిన ఫైనల్లో లడఖ్ స్కౌట్స్ జట్టు ఐటీబీపీ జట్టుపై విజయం సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నూతన లోగో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త లోగోను 2020 ఫిబ్రవరి 14న ఢిల్లీలో ఆవిష్కరించారు. సింహం బొమ్మతో కూడిన లోగో.. ధైర్యమైన, నిర్భయమైన జట్టు వ్యక్తిత్వాన్ని చాటుతుందని యాజమాన్యం పేర్కొంది. లోగోతో పాటు ఆ జట్టు జెర్సీ డిజైన్ను కూడా మార్చారు.
కశ్మీర్, లడఖ్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్
కేంద్రపాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూకశ్మీర్లలో 'ఖేలో ఇండియా వింటర్ గేమ్స్-2020'ను నిర్వహించనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు 2020 ఫిబ్రవరి 13న ప్రకటించారు. పోటీల్లో పాల్గొనే బాలబాలికలను వయసు ఆధారంగా మొత్తం నాలుగు విభాగాలుగా విభజించనున్నారు.
ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా మన్ప్రీత్సింగ్
2019 ఏడాదికి గాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును భారత పురుషుల హాకీ జట్టు సారథి మన్ప్రీత్సింగ్ గెల్చుకున్నాడు. దీంతో ఈ అవార్డును గెల్చుకున్న తొలి భారత హాకీ ప్లేయర్గా మన్ప్రీత్ రికార్డు నెలకొల్పాడు.
ఐఓసీ బాక్సింగ్ ర్యాంకింగ్స్లో అమిత్కు అగ్రస్థానం
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బాక్సింగ్ టాస్క్ఫోర్స్ ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత బాక్సర్, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ రజత పతక విజేత అమిత్ పంఘాల్ అగ్రస్థానంలో నిలిచాడు. 52 కేజీల విభాగంలో 420 పాయింట్లతో అమిత్ అగ్రస్థానంలో నిలిచాడు.
- యన్.సంతోష్కుమారాచారి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270