Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విటమిన్స్ లోపం, విపరీతమైన ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వంటి వివిధ కారణాల వల్ల అతి చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు వస్తాయి. ముఖం మీద వచ్చే మడతలు ముఖ కాంతిని దూరం చేయడమే కాకుండా వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. దాంతో ఎంతో మంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. అసలు ముఖంపై వచ్చే ఈ ముడతలని నివారించడానికి మనం ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- అరటి పండు గుజ్జును ముఖానికి రాసుకొని అది పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడు క్కోవాలి. దాంతో మంచి ఫలితం ఉంటుంది.
- రాత్రి పూట పడుకునే ముందు బంగాళదుంప గుజ్జును ముఖానికి రాసుకోవాలి. అది పూర్తిగా ఆరిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా రెండు వారాలు క్రమం తప్పకుండా చేస్తే ముఖంలో మార్పు వస్తుంది.
- తాజాగా ఉండే బొప్పాయి పండు గుజ్జును తీసుకుని ముఖానికి రాసుకోవాలి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత చల్లని నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ ముఖానికి రాసుకోవడం ఇష్టం లేకపోతే బొప్పాయిని తినొచ్చు. అలా తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
- కోడిగుడ్డులో ఉండే తెల్లసొనని తీసుకొని అందులో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్లకు అంటకుండా ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కుంటే ముడతలు మాయమవుతాయి.
- ఒకవేళ ముఖంలో ముడతలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి రెగ్యులర్గా రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.