Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి.. స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యం కూడా పెరుగుతుంది.
- స్నానం చేసేటపుడు పసుపు, శనగ పిండి మిశ్రమాన్ని ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే చర్మం నిగనిగలాడుతుంది. అదేవిధంగా చర్మంపైన ఉండే మొటిమలు లాంటివి కూడా తగ్గిపోతాయి.
- ఎక్కువసేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్లు, లేక ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటపుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్గా పనిచేసి ఉపశమనం కలుగుతుంది.
- ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిమిషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి