Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మందికి పీరియడ్స్ సమయంలో విపరీతమైన చికాకు, నీరసం, కడుపునొప్పి వంటివి వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటి నుండి మనం తీసుకునే ఆహారం ద్వారా ఉపశమనం పొందవచ్చు...
- ఈ సమయంలో శరీరం ద్రవపదార్థాలను కోల్పోతుంది. కాబట్టి మిగతా రోజుల కన్నా పీరియడ్స్ రోజులలో మంచి నీరు కాస్త ఎక్కువగా తాగితే మంచిది.
- ఆకుకూరలలో కావలసినంత ఐరన్ ఉంటుంది. పీరియడ్స్ సమయంలో శరీరానికి అందాల్సిన పోషకాలని ఈ ఆకుకూరలు అందిస్తాయి. కాబట్టి ఆకుకూరలను ఆ మూడు రోజులూ తప్పనిసరిగా ఆహారంలో చేర్చండి.
- పీరియడ్స్ సమయంలో అరటిపండు తీసుకోవాలి. ఇందులో ఉండే పొటాషియం, బి6 విటమిన్లు రక్తంలోని గ్లూకోజ్ పై ప్రభావాన్ని చూపిస్తాయి.
- చిక్కుడు కుటుంబానికి చెందిన చిరుధాన్యాలను తీసుకుంటే మంచిది. వాటిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. బీన్స్, చిక్కుడుకాయ కూరలను ఆహారంలో చేర్చుకోవడం వలన శారీరక సమతౌల్యం ఏర్పడుతుంది.
- చాలా మందికి ఈ సమయంలో చికాకుగా ఉంటుంది. అలాంటి వారు ఓ చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తీసుకుంటే చికాకు పోయి హాయిగా ఉంటుంది. డార్క్ చాక్లెట్లో మెగ్నీషియం ఉండటమే కాకుండా, ఫీల్ గుడ్ కెమికల్ అయిన సెరటోనిన్ను కూడా రిలీజ్ చేస్తుంది. దాని వలన చికాకు తగ్గుతుంది. పీరియడ్స్ రోజులలో మెగ్నీషియం, ఐరన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. వ