Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలసరి సమయంలో వచ్చే మొటిమల వల్ల చాలామంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. దీనికోసం ఏవేవో క్రీములు వాడుతుంటారు. అయితే మొటిమలను వంటింటి చిట్కాలతో దూరం చేసుకోవచ్చు.
ట టమాటా, నిమ్మరసాన్ని సమపాళ్ళలో తీసుకుని ముఖానికి పట్టించినట్లైతే మొటిమలు దూరమవుతాయి.
ట కలబంద గుజ్జును, నిమ్మ రసాన్ని కలిపి ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత నీటితో కడగాలి. ఇలా చేస్తే మొటిమలు పోవడమే కాక ముఖం ప్రశాంతవంతంగా మారుతుంది.
ట చిటికెడు పసుపు, చిటికెడు నిమ్మరసాన్ని కలిపి ఆ పేస్టును మొటిమలు ఉండే ప్లేస్లో అప్లైరు చేస్తే ఎలాంటి మచ్చలైనా తొలగిపోతాయి.
ట బంగాళదుంప ముక్కల్ని ముఖంపై ఉన్న మచ్చలపై రుద్దితే ఫలితం ఉంటుంది.
ట నిమ్మకాయ రసం అన్నీరకాల చర్మవ్యాధుల్ని అరికడుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల విషపు కణాలు దూరం అవుతాయి.
ట దోసకాయ గుజ్జు పాల మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ు