Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిడ్డకు జన్మనివ్వడమంటే మరో జన్మ ఎత్తడమే. బిడ్డ కడుపున పడిన నాటి నుండి భూమి మీద పడే వరకూ తల్లి పడే ఆరాటం అంతా ఇంతా కాదు. బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని, ఆరోగ్యంగా పుట్టాలని ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కేవలం జాగ్రత్తలు తీసుకుంటే చాలదు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఇవే అవి...
- గర్భంతో ఉన్నప్పుడు బీపీ ఎక్కువ ఉంటే బిడ్డపై ప్రభావం పడుతుంది. తల్లికి కూడా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకోవాలి.
- అలాగే షుగర్ టెస్ట్. చక్కెర పాళ్లు ఎక్కువైతే ఉమ్మనీరు పెరుగుతుంది. బిడ్డ పరిమాణం కూడా పరిమితిని మించి పెరుగుతుంది. దానివల్ల నెలలు నిండకముందే పుట్టే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు బిడ్డ కడుపులోనే చనిపోయే ప్రమాదమూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.
- బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిలో థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా విడుదలవ్వాలి. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ తప్పనిసరి.
- హెచ్ఐవీ పరీక్ష కూడా తప్పకుండా చేయించాలి. అలాగే హెపటైటిస్ టెస్ట్ కూడా.
- అలాగే సిఫిలిస్ టెస్ట్ కూడా చేయాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇది కూడా తప్పనిసరి.
- తల్లికి యూటీఐ ఉందేమో అన్నది కూడా పరీక్షించాలి. ఎందుకంటే యూరినరీ ఇన్ఫెక్షన్ల వల్ల బిడ్డ బరువు పెరగకపోవచ్చు. ముందుగానే డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
- తల్లిలో రక్తహీనత ఉన్నా బిడ్డ సరిగ్గా ఎదగదు. కాబట్టి రక్తహీనత నిర్థారిత పరీక్ష తప్పదు.