Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా నియంత్రణలో మహిళల పాత్ర కీలకం. ఇంటి పని నుండి మొదలుపెడితే ఇంటింటికి తిరిగి సర్వేలు చేయడం, రోగులను గుర్తించడం, వీధులు శుభ్రం చేయడం లాంటివన్నీ మహిళలే చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో మహిళా సంఘాలు ఆ బాధ్యతను సమర్థంగా చేపడుతున్నాయి. భోజనం అందించడం దగ్గర నుంచి ఆరోగ్యం కాపాడడం వరకూ అన్ని విధాలా తమ వంతు సాయం అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో మహిళలు తమ సేవలు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. కేరళ మహిళలు ఈ విషయంలో ముందున్నారు.
కుదుంబశ్రీ.. ఇది అక్కడి మహిళా స్వయం సహాయక బందాల సంస్థ. లాక్ డౌన్ తరవాత దేశమంతా పేదలు, వలస కార్మికుల ఆకలి కేకలు వినిపించాయి. కానీ కేరళ కుదుంబశ్రీ మహిళల కమ్యూనిటీ కిచెన్ అందరికంటే కాస్త ముందుగా వారి ఆకలి తీర్చింది. అక్కడి స్థానిక సంస్థలతో కలిపి కుదుంబ శ్రీ సంఘాలు ఈ వంటశాలలు ఏర్పాటు చేశాయి. పేదల దగ్గర నుంచి క్వారంటైన్లో ఉన్నవారి వరకూ అందరికీ భోజనం అందజేశాయి. మొత్తం 1304 కమ్యూనిటీ కిచెన్స్లో 1100 వంటశాలల్ని ఈ మహిళా సంస్థలే నడుపుతున్నాయి.
కాస్త డబ్బు పెట్టగలిగిన వారి కోసం 238 కిచెన్లను హౌటళ్లుగా కేటాయించారు. అక్కడ 20 రూపాయలకే భోజనం దొరుకుతుంది. ఇక సరిహద్దుల్లో, లారీ డ్రైవర్లు ఎక్కువగా ఇరుక్కుపోయిన చోట, వారి కోసం 15 టేక్ అవే పాయింట్లు ఉన్నాయి. సాధారణ వ్యక్తులతో పాటు గుర్తించిన 1,57,691 అనాథ కుటుంబాలకి కూడా ఆహారం అందుతోంది. కేరళ సివిల్ సప్లైస్ శాఖ 87 లక్షల కుటుంబాలకు ఇవ్వాల్సిన నిత్యావసరాల కిట్లను తయారు చేయడంలో వీరి సాయం తీసుకుంది. దానికి అదనంగా ఆ కిట్లకు కావల్సిన సంచులు కుట్టే పని కూడా వీరే తీసుకున్నారు. ఇక అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం లాక్డౌన్లో కూడా ఆగకుండా చూస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కూడా సరిపడా అమతం నూట్రిమిక్స్ నిల్వ పెట్టుకున్నారు. పంపిణీ కూడా జరుగుతోంది. గిరిజన ప్రాంతాలకు కూడా ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. కొన్ని చోట్ల పడవల్లో సూపర్ మార్కెట్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏండ్లు పైబడిన వారు ఎక్కడా బయటకు రాకుండానే వారి అన్ని అవసరాలు తీర్చేలా చేశారు. విస్తత నెట్వర్క్, సమర్థులైన సభ్యులు, వారి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్.. ఇలా ఎన్నో సేవలు అందిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి.
కేవలం భోజనం పెట్టడమే కాదు.. ఆప్యాయంగా పలకరించి మంచి చెడ్డలూ చూస్తున్నారీ మహిళలు. ఇందుకోసం స్నేహిత అనే కార్యక్రమం ఉంది. ఎవ్వరూ లేని కుటుంబాల్లో 1,22,920 మంది వద్ధులే ఉన్నారు. లాక్డౌన్ సమయంలో వారందరినీ రోజూ పలకరించడం కుదుంబశ్రీ పనుల్లో ఒకటి. క్వారైంటన్లో ఉన్నవారికి ధైర్యం చెప్పేందుకు పలకరిస్తారు. కేవలం దీని కోసమే 2,500 మంది ఉన్నారు. ఇంతేకాదు ఇంట్లోనే అందరూ ఉండిపోవడంతో మానసిక ఒత్తిడి ఎదుర్కోవడానికీ, గహహింస ఎదుర్కొంటుంటే గుర్తించడానికీ కూడా స్నేహిత కౌన్సిలింగ్ కార్యక్రమం పనిచేస్తోంది.
కుదుంబ శ్రీ చేసిన ముఖ్యమైన పనుల్లో కమ్యూనికేషన్ ఒకటి. బ్రేక్ ద చైన్ కాంపైన్ ద్వారా చేతులు కడుక్కోవడం, దూరం పాటించడం, శుభ్రత గురించి అవగాహన కల్పించడంలో చురుగ్గా వ్యవహరించారు. వాట్సప్ ద్వారా, అది లేని చోట ప్రత్యక్షంగా ప్రచారం, అవగాహన కల్పించారు. దీనికేసమే సుమారు లక్షా 90 వేల వాట్సాప్ గ్రూపులు వున్నాయి. వీటిలో 22 లక్షల 50 వేల మంది సభ్యులు ఉన్నారు.
నిజానికి మహిళా స్వయం సహాయక బందాలు దేశమంతా ఉన్నాయి. కానీ కొన్ని చోట్లే బాగా విజయవంతమయ్యింది. కేరళ వంటి చోట్ల ఈ సంఘాలు శక్తివంతంగా, సంపన్నంగా ఎదిగాయి. ఈ కుదుంబశ్రీలను తెలుగు రాష్ట్రాల్లోని డ్వాక్రా గ్రూపులతో పోల్చవచ్చు. కేరళలో 1990లలో ఇది ప్రారంభమయింది. 2019 మార్చి నాటికి అక్కడ మొత్తం 2,91,507 స్వయం సహాయక బందాలున్నాయి. వాటిపైన 19,489 ప్రాంతీయ అభివద్ధి సంఘాలు, మరో 1064 కమ్యూనిటీ అభివద్ధి సంఘాలు ఉన్నాయి. వీటిలో 43 లక్షల 93 వేల 579 మంది మహిళలు సభ్యులుగా ఉన్నవారు. ఏ మహిళ అయినా ఇందులో చేరవచ్చు, కాకపోతే ఇంటికి ఒక్కరు మాత్రమే చేరాలి. సమగ్ర ఆర్థిక, సామాజిక, మహిళా సాధికారిత ఈ సంస్థ లక్ష్యం. సూక్ష్మ రుణాలు, సూక్ష్మ వ్యాపారాలు, ఉమ్మడి సాగు, జంతువుల పెంపకం, మార్కెట్ అభివద్ధి, వాల్యూ చైన్ ఆధారిత వ్యవహారాలు వంటివన్నీ ఆర్థిక కార్యకలాపాల కిందకు వస్తాయి. ఆశ్రయ (దిక్కులేని వారికి సాయం చేయడం), బాలసభ (పిల్లల కోసం), బడ్స్ (ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్య కోసం), ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రాజెక్టులు ఇవన్నీ సామాజిక కార్యక్రమాల కిందకు వస్తాయి. ఇక మహిళల కోసం కార్యక్రమాల గురించి చెప్పక్కర్లేదు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ కుటుంబశ్రీలు చేస్తున్నాయి.
కరోనా వ్యాప్తిని ముందుగానే ఊహించిన కుటుంబ స్త్రీ సంస్థ శానిటైజర్లు, మాస్కులు తయారీ మొదలుపెట్టింది. 21 యూనిట్లలో నిరంతరం శానిటైజర్లు, 306 యూనిట్లలో రోజుకు 1,26,000 వేల మాస్కులు తయారు చేయడం ప్రారంభించారు. మార్చి 15 నుంచే వీరు ఉత్పత్తి ప్రారంభించారు. వీరు తమ ఉత్పత్తులును ఆసుపత్రులు, విధులు నిర్వహిస్తోన్న ప్రభుత్వ సిబ్బందికి అందించారు. ఈ విషయంలో కేవలం కేరళ మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ మహిళా సంఘాలకూ అక్కడి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ ఆర్డర్లిచ్చాయి. లక్షల సంఖ్యలో మాస్కులు ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రల్లో కూడా ఈ మాస్కుల తయారీ జరుగుతోంది. తెలంగాణలోని జనగామలో శానిటైజర్ల తయారీ కూడా జరుగుతోంది
లాక్డౌన్ వల్ల ఇబ్బంది పెడకుండా కుటుంబశ్రీ మహిళలందరికీ 20 వేల రుణ సౌకర్యం కల్పించింది కేరళ ప్రభుత్వం. ఆరు నెలల తర్వాత వాయిదాల ద్వారా ఈ సొమ్ము కట్టవచ్చు. ముఖ్యమంత్రి సాయం కింద దాదాపు 2 వేల కోట్లు అందిస్తున్నారు. కేరళలో దాదాపు 45 లక్షల కుటుంబాల మహిళలు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. అంటే మొత్తం కేరళలో ఉన్న కుటుంబాల్లో సగంపైగా, సుమారు 55 శాతం కుటుంబాలకు ఈ సాయం అందుతోంది.
అక్రిడెటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, ఆగ్జిలరీ నర్స్ మిడ్ వైఫ్.. ఇలా చెప్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. మొదటిది ఆశా వర్కర్ పూర్తి పేరు, రెండవది ఏఎన్ఎం పూర్తి పేరు. ఇప్పుడు భారతదేశ ప్రజారోగ్య వ్యవస్థకి వెన్నెముక వీరే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం పట్ల అవగాహనా, వైద్య సౌకర్యాలు లేని చోట్ల వీరి పాత్ర ఎంతో కీలకం. కోవిడ్ సమయాల్లో ఈ మహిళలు ఏమాత్రం వెరవకుండా చేస్తోన్న డ్యూటీ ఇప్పుడు రాష్ట్రాలను కరోనా నుంచి కాపాడుతోంది. రోగులకు వైద్యం డాక్టర్లు చేస్తున్నా అసలైన క్షేత్ర స్థాయి పని.. అంటే అవగాహన కల్పించడం, ఎవరికి ఆరోగ్యం బాలేదో గుర్తించడం. ఇంటింటికీ తిరిగి సర్వే చేయడం ఈ మహిళలే చేస్తున్నారు.