Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొటిమలూ, వాతావరణ కాలుష్యం ప్రభావాల వలన ముఖం మీద మచ్చలు సులువుగా ఏర్పడతాయి. ఒంటి రంగు కూడా తగ్గిపోతుంది. ఈ సమస్యను ఇంట్లో దొరికే పదార్థాలతోనే పరిష్కరించవచ్చు.
పచ్చిపాలతో : పాలను మించిన సహజ క్లెన్సర్ మరేది లేదు. పచ్చి పాలకి కొంచెం నిమ్మరసం కలిపి మచ్చలు ఉన్న చోట రాసుకొని, అరగంట తర్వాత నీళ్ళలో ముంచిన దూదితో శుభ్రం చేసుకోవాలి.
పుదినాతో : పుదీనా ఆకులను మిక్సిలో మెత్తగా పేస్టు చేసి రాత్రి పడుకునే ముందు ముఖమంపై మచ్చలు ఉన్న చోట రాసుకోవాలి. ఉదయం గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. పుదీనా ఆకులను, పుసుపును కలిపి పేస్టులా తయారు చేసుకుని చర్మంపై రాసుకొని అరగంట తర్వాత కడిగేసుకున్నా మంచిదే.
దానిమ్మతో : దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పొడిచేసుకొని, దానికి నాలుగు చుక్కలు నిమ్మ రసం కలిపి మచ్చలు ఉన్న చోట రాయాలి. కొంత సేపటి తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ వుంటే మచ్చలు త్వరగా తగ్గిపోతాయి.
మునగాకుతో : మునగాకులను మెత్తగా నూరి దానిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.