Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ ఎఆర్ఐ సంస్థ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ప్రతిష్టాత్మకమైన షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియోస్ కాంటెస్ట్ను 'చిత్రం భళారే విచిత్రం' పేరుతో నిర్వహిస్తోంది.
ఈ కాంటెస్ట్కి న్యాయ నిర్ణేతలుగా జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం 'మహానటి' దర్శకులు నాగ్ అశ్విన్, సామాజిక అంశాలతో అవార్డ్ పొందిన లఘుచిత్రాలు, మ్యూజిక్ వీడియోస్ రూపొందించిన ప్రముఖ లఘు చిత్రాల దర్శకులు డా.ఆనంద్ వ్యవహరిస్తున్నారు. 'సామాజిక ఇతివత్తంగా పదిహేను నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను, 4 నిమిషాల నిడివి గల మ్యూజిక్ వీడియోలను ఈనెల 15వ తేదీలోగా పంపించాలి. ఈ అవకాశాన్ని ప్రతిభ, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. 'చిత్రం భళారే విచిత్రం' పేరుతో నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్కి 'మహానటి' దర్శకులు నాగ్ అశ్విన్, ప్రముఖ లఘు చిత్రాల దర్శకులు డా.ఆనంద్ వ్యవహరిస్తున్నారు' అని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నిర్వాహకులు అశోక్ చింతకుంట, రమ. కె.వనమ, ఉష మన్నెం, దీప్తి రెడ్డి, నిత్యశ్రీ మీడియాకి తెలిపారు.