Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది చిన్నవయసులోనే వద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. చర్మం ముడతలు పడి పెద్ద వయసు వ్యక్తుల్లా కనిపిస్తారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఈ చిట్కా పాటించండి.
- కొత్తిమీరను బాగా పేస్ట్ చేయండి. అందులో కాస్త కలబంద గుజ్జును కలపండి. ఆ పేస్టుకు ముఖానికి రాసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు తర్వాత నీళ్లతో కడిగేసుకోండి. కొత్తిమీరలో ఉండే విటమిన్ ఏ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా తాజాగా ఉంటుంది. వారంలో కనీసం రెండు, మూడు సార్లు ఈ చిట్కా పాటిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
- చర్మంపై మతకణాలు వయసును పెంచేసి ముఖాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే.. దనియాల పొడిని ఉపయోగించండి. కొత్తిమీరలో ఉన్న సుగుణాలే దనియాల్లో కూడా ఉంటాయి. కాబట్టి.. దనియాలను పొడిగా చేసి.. కాస్త నీటిని కలిపి పేస్టులా చేసుకోండి. వీటిలో కొన్ని ఓట్స్, గుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి పూసుకోండి. తర్వాత గోరువెచ్చని నీటితో నెమ్మదిగా ముఖాన్ని కడగండి. లేదా ఏదైనా గుడ్డను వెచ్చని నీటిలో ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రోజూ చేస్తే తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.