Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో తమకు నచ్చే వెరైటీ ఫుడ్ లేకపోవడంతో పిల్లలు ఎక్కువగా బయట ఆహారాన్నికే ప్రాముఖ్యం చూపిస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పిల్లలకు బయటి ఆహారపదార్థాలు ఇవ్వడం అంత మంచిది కాదు. కాబట్టి వారితో బయటి ఆహారం మానేసి ఇంట్లో ఆహారం ఇష్టపడాలంటే మీరు ఇంట్లో చేసే వంటలు కాస్త వెరైటీగా ఉండాలి. మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతో కాస్త వెరైటీగా ఇలా చేయండి.
- సాధారణంగా పాలు ఇష్టపడని పిల్లల కోసం పాలతో కోవా, కలా ఖండ్, సేమియా లాంటివి చేసి ఇవ్వవచ్చు. పాల పదార్థాలు కాల్షియం, ప్రోటీన్ని కలిగి ఉండి పిల్లల పెరుగుదలకు సహాయ పడతాయి.
- చాక్లేట్స్, బిస్కట్స్కి బదులు ఇంట్లో డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు కానీ, పల్లీ చిక్కి గాని ఇవ్వొచ్చు. డ్రై ఫ్రూట్స్ రోగ నిరోధక శక్తిని, ఖర్జూర ఐరన్ సమద్ధిగా కలిగి ఉంటుంది.
- మధ్యాహ్నం భోజనంలో అన్నాన్నే కాస్త వెరైటీగా మ్యాంగో రైస్(మ్యాంగో పులిహౌర), వెజిటబుల్ రైస్, ఎగ్ రైస్, జీర రైస్, పాలక్ రైస్, పన్నీర్ కర్రీ రైస్ ఇలా కాస్త డిఫరెంట్గా చేయండి. వీటి వలన కార్బోహైడ్రేట్లు శరీరానికి చక్కగా అందుతాయి.
- బయట లభించే నూనే పదార్థాలు ఇంట్లోనే చేసి, అప్పుడప్పుడు పిల్లలకు ఇస్తూ ఉండండి. ఉదాహారణకు చెకోడీలు, వడలు, మిర్చి బజ్జీలు, పనీర్ పేలాలు, బేల్ పూరీ, అటుకుల పోహ, చుడువా, కారపూస లాంటివి. దాంతో బయటి ఆహారం నుండి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
- ఇంట్లో స్నాక్స్ కోసం వేయించిన పల్లీలు, బఠానీలు, ఆలు చిప్స్ (ఇంట్లో చేసినవి) ఖర్జూరాలు, బాదం, జీడి పప్పు, పిస్తా లాంటివి వారికి అందుబాటులో ఉండేలా చూసుకోండి.
- గులాబ్ జామున్, క్యారేట్ హల్వా, రవ్వ లడ్డులు, డబల్కా మీఠా, సున్నుండలు పిల్లలకు తినిపించడం అలవాటు చేయాలి.ఈ స్నాక్స్లో పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటాయి.
ఈ విధంగా వారి ఇష్టాలు అభిరుచులు కనుక్కొని వారికి నచ్చినట్టు చేసిపెట్టండి. ఈ సూచనలు పాటిస్తూ నూనే పదార్థాలు కాస్త తగ్గించి, బయట ఆహారం కాకుండా ఇంటి అహారాన్నికి ప్రాముఖ్యం చూపేలా చేయండి.
- పి.వాణి, డైటీషియన్