Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మఖ్తల్ ఎమ్మెల్యే
నవతెలంగాణ-నారాయణపేట
దేశం కోసం స్వసంత్ర ఉద్యమంలో పాత్ర పోషించిన వారు గొప్ప మహనీయులని మఖ్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఊట్కూర్ మండల కేంద్రంలోని స్వాసంత్ర సమరయోదుడు రోషనప్ప రెండ్రోజుల క్రితం మరణించడంతో ఆయన వారి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. నిత్యం సమాజం కోసం రైతుల కోసం ఆర్యసమాజం కోసం తన వంతు కృషి చేశాడని కొనియడారు. స్వసంత్ర ఉద్యమ సమయంలో రజాకర్లకు ఎదురోడి చేసిన పోరాటలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రోషనప్ప భార్య కుమారుడు రమేష్ను ఓదార్చరు. వారి కుటుంబానికి అండగా వుంటాన్నని భరోసా కల్పించారు. పరామర్శించిన వారిలో జడ్పీటీసీ సుర్యాప్రకాష్రెడ్డి, మఖ్తల్ మార్కేట్ కమిటీ చైర్మన్ నర్సిములుగౌడ్, ఊట్కూర్-2 ఎంపీటీసీ గోవిందప్ప, మహిపాల్రెడ్డి ఉన్నారు.