Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొల్లాపూర్ రూరల్ ;
ప్రయివేటు ఆటోలు వద్దు ఆర్టీసీ బస్సులు కావాలని మండలంలోని ముక్కిడిగుండం గ్రామ యువకులు శుక్రవారం గ్రామంలోని ప్రధాన కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. చాలా కాలంగా గ్రామం నుంచి ఆటోలో ప్రయాణిస్తుంటే ఎన్నోసార్లు ప్రమాదాలకు గురైయ్యామన్నారు. ఆర్టీసీ బస్సులు సమయానికి నడిపిస్తే ప్రయివేటు వాహనాల బాధ తప్పుతుందని యువకుల వాపోయారు. ఆటోలు ఎక్కువగా నడుస్తున్నందునే బస్సులు వేయడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం గ్రామ యువకులు ప్రదాన కూడలిలో బైటియించారు. దాదాపు మూడు గంటల సేపు నిరసనను తెలిపిన అనంతరం ఆర్టీసీ డీఎమ్కు ప్రయివేటు వాహనాలు నడనివ్వవద్దని వినతిపత్రం అందించినట్టు తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో అశోక్, బాలపీరు, తారాసింగ్, కృష్ణయ్య, తదితరులు తెలిపారు.