Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బిజినపల్లి
తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఐక్య వేదిక టీ మాస్ ఫోరమ్ సదస్సు వాల్ పోస్టర్ను టీ మాస్ జిల్లా నేత ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువకులకు నిరాశే మిగిలిందన్నారు. విద్యా వైద్యం కార్పొరేట్ సంస్థల చేతుల్లో చిక్కుకున్నాయన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని రాష్ట్రంలో అన్నదాత ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. కార్పొరేట్ శక్తులు తెలంగాణ వనరులు దోచుకుంటూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాయని అన్నారు. వందలాది ఎకరాలు కార్పొరేటర్లకు కట్టబెడుతున్నా రని భూ కుంభకోణాలతో భూములను ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది సంఘాలు సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఐక్య వేదికగా ఏర్పడ్డాయని అన్నారు. ఈ నెల 20 వతేదిన జిల్లా కేంద్రంలో గల లహారిగార్డెన్లో నిర్వహించబోయే టీ మాస్ ఫోరమ్ సదస్సుకు వివిధ ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు బోనాసి సుధాకర్, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు చంద్రశేఖర్, గంగాధర్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మల్లేష్, ఎల్హెచ్పిఎస్ జిల్లా నాయకులు హన్యనాయక్, దళిత సంఘాల నాయకులు వెంకటస్వామి, రాములు, హుస్సేన్ బాలయ్య, కురుమయ్య, బాల్ రాజులు పాల్గొన్నారు.
తిమ్మాజిపేట :
ఈ నెల 20న నాగర్కర్నూల్ జిల్లాలో నిర్వహించే టీ మాస్ ఫోరమ్ సభ పోస్టర్ను టీ మాస్ సభ్యులు శుక్రవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు కొట్ర నవీన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పాలకుల ఈ సదస్సుకు ప్రజలు , ప్రజా సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివ, సుధాకర్, శ్రీనివాస్, వెంకటరాములు పాల్గొన్నారు.
నాగర్కర్నూల్ :
టీ మాస్ ఫోరమ్ జిల్లా సదస్సు జయప్రదం చేయాలని టీ మాస్ జిల్లా నాయకులు ఎల్ దేశ్యానాయక్ , ఆర్ శ్రీనివాస్ అన్నారు. ప్రచార ఆటో జాతరను శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సామాజిక న్యాయం తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం టీ మాస్ ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 93శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సబ్బండ కులాలకు సామాజిక న్యాయం కల్పిస్తామన్నారు. ఈ నెల 20న లహారి గార్డెన్లో జరిగే ఈ సభకు ప్రజా యుద్ధనౌక గద్దర్ , ప్రజా గాయకుల విమలక్క , తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీ, రాజు, ఐలయ్య, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పర్వతాలు , మధు, అశోక్, మల్లేష్, శివ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.