Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెంట్లవెల్లి
మండలంలోని జటప్రోలు గ్రామ వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ కడప వెంకటరమణ తెలిపారు. ఇటీవల ఈ నెల 7న ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తుండగా రైతులు, గ్రామస్తులు అడ్డుకుని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కలెక్టర్ ఆదేశానుసారం తహశీల్దార్ జటప్రోలు గ్రామానికి చేరుకుని రైతు కమిటీ గ్రామస్తులతో చర్చించారు. అక్రమ ఇసుక వల్ల పంటలు ఎండిపోయి మేము ఉపాధి కోల్పోతామని గ్రామస్తులు, రైతు కమిటీ నాయకులు తహశీల్దార్కు విన్నవించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ... జటప్రోలు నుంచి ఇసుక తరలించడానికి అధికారికంగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే మాకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు కమిటీ గ్రామస్తులు పుల్లయ్య, ఖాజా మెయినుద్దీన్ , ఉప సర్పంచ్ నూర్ పాష, భాస్కర్, రామస్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు. .