Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొల్లాపూర్ రూరల్
కొల్లాపూర్, పెంట్లవెల్లి రెండు మండల్లాలో శుక్రవారం 1085మంది పిల్లలకు మిజిల్స్, రుబెల్లా టీకాలు వేశారు. మండలాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలల్లో ఏఎన్యంలు పిల్లలకు టీకాలు వేశారు. అలాగే ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య సిబ్బంది తమ కర్తవ్యం నెరవేర్చారు. రెండు మండలాల్లో కలిపి 7,325 పిల్లలున్నారని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్యూనిట్ అధికారి రామ్మోహన్ తెలిపారు. ఇంకా చాలా మంది పిల్లలకు ఈ టీకాలను వేయాల్సివుందన్నారు. పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలుగా 9 నెలల నుంచి 15 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలను గుర్తించి ఈ టీకాలు వేయనున్నట్టు తెలిపారు. కాగా శుక్రవారం కొల్లాపూర్ సివిల్ ఆస్పత్రిలో డాక్టర్ యశ్వంత్రాణి పిల్లలకు టీకాలు వేశారు.