Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ-కొల్లాపూర్ రూరల్
మైనార్టీ గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన పోషాకాహరం ఇవ్వడంలో విఫలమైన జిల్లా మైనారిటీ అధికారి సప్తగిరిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ కొల్లాపూర్ మండల శాఖ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తహశీల్దారు కార్యాలయంలో ఆర్ఐ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. మైనార్టీ పాఠశాలల విద్యార్థులకు గుడ్లు, చికెన్ను సరఫరా చేస్తున్న వ్యాపార వర్గాలతో కూర్చుని బార్లలో విలాసాలు చేస్తున్నాడని ఆరోపించా రు. అలాగే మైనార్టీ పాఠశాలల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన సాంకేతిక పరికరాల కొనుగోలుల్లో అక్రమాలకు పాల్పడ్డాడని విమర్శించారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యతాయుతమైన పదవీలో ఉంటూ అక్రమార్కుల వెంట బార్లలో తాగుతూ విలాసాలు చేయడం దారుణమన్నారు. వెంటనే ఎలాంటి విచారణ లేకుండానే అతనిని విధుల నుంచి తొలగించాలని ఎస్ఎఫ్ఐ కొల్లాపూర్ మండలశాఖ డిమాండ్ చేస్తోంది.
కొల్లాపూర్ :పేద విద్యార్థులకు అందించే గుడ్లు చికెన్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బార్లలో విందులు చేసుకుంటున్న సప్తగిరిని వెంటనే తొలగించాలని లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లింగస్వామి, శివాజి, రమేష్ , రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
నాగర్కర్నూల్ :
మైనార్టీ శాఖలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి జిల్లా అధికారి సప్తగిరిపై చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలకు అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు కొనడంలో భారీ అక్రమాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నేత పి మల్లేష్, బీసీ సబ్ప్లాన్ నేత నవీన్, ఎస్ఎప్ఐ నాయకులు శివ, భద్ర, శ్రీశైలం లు పాల్గొన్నారు.