Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబ్నగర్
తపాలా ఉద్యోగులు హక్కుల కోసం పట్టణ కేంద్రంలోని హెచ్ పోస్టాపీస్ ఎదురుగా చేస్తున్న సమ్మె శుక్రవారంతో మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ ఉద్యోగులను చీమల కన్నా హీనంగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలను ఉత్తరాల రూప ంలో సేవలు చేస్తున్నా మాకు మాత్రం కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. బ్రిటీష్ కాలనం నాటి విధానమే నేటికీ అమలు కావడం బాధాకరకంగా ఉందన్నారు. మా సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఈ సమ్మెను కొసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రజినీకాంత్, కృష్ణయ్య, కుమార్ పాల్గొన్నారు.