Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబ్నగర్
వీఆర్ఏ, వీఆర్ఓలను వ్యవసాయ శాఖలో విలీనం చేయొద్దని వీఆర్ఏ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గోవింద్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి. సింగ్కు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల వీఆర్ఓ, వీఆర్ఏలను వ్యవ సాయ శాఖలో విలీనం చేస్తున్నట్టు ప్రకటనలు వచ్చాయన్నారు. రెవెన్యూ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి శాఖలో పని చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రక్షాలన చేసే సందర్భంలో ఇతర శాఖలో విలీనం సరికాదన్నారు. ప్రభుత్వానికి వీఆర్ఓ, వీఆర్ఏలు రెండు కండ్ల లాంటి వారన్నారు. వీరందరినీ రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని కోరారు. ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామినిచ్చినట్టు వారు తెలిపారు. కార్యక్ర మంలో సంఘం రాష్ట్ర కోశాధికారి వెంకటయ్య, రాష్ట్ర గౌరవ కార్యదర్శి సాయన్న, వనపర్తి జిల్లా గౌరవాధ్యక్షుడు విజరుకుమార్ పాల్గొన్నారు.