Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడ్డాకుల : మండల కేంద్రంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీడీఓ నర్సింగారావు ఆధ్వర్యంలో వివిధ గ్రామాల కో ఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న వయోజనుల విద్యాభాసానికి సంబంధించిన హాల్ టికెట్లు, పరీక్షల సామాగ్రిని ఎంపీడీఓ గ్రామ కో-ఆర్డినేటర్లకు అప్పగించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ... జాతీయ సార్వత్రిక ఓపెన్ స్కూల్ కోసం ఎంట్రెన్ నిర్వహిస్తున్నామన్నారు. ఆయా గ్రామాల్లోని ఆసక్తి కలిగిన వారు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో మండల కో-ఆర్డినేటర్ రవీందర్నాయక్, గ్రామ కో-ఆర్డినేటర్లు మోతిలాల్, వెంకట్రాములు, రవీందర్రెడ్డి, అనురాధ, సత్యనారాయణ, జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.