Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నాగర్కర్నూల్
బంగారు తెలంగాణ దిశగా నిన్నటి నేపథ్య ం- రేపటి సంకల్పం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పుస్తకాన్ని విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఇ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక ఆర్థిక ముఖచిత్రం, బంగారు తెలం గాణ దిశగా నిన్నటి నేపథ్యం- రేపటి సంకల్పం అనే పుస్తకాన్ని ప్రణాళిక శాఖ ప్రచురించిందని పేర్కొన్నారు. దాన్ని రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యా క్షులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విడుదల చేశారని ఈ పుస్తకం రీసెర్చ్ స్కాలర్స్కు, విద్యార్థులకు టీఎస్పీఎస్సీ నిర్వహించే ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగ కరంగా ఉంటుందని తెలిపారు. ఈ పుస్తకాన్ని కలెక్టరేట్ లోని ముఖ్యప్రణాళిక అధికారి కార్యాల యంలో రూమ్ నెంబర్ 110లో అందుబా టులో ఉంటాయని, కావాల్సిన వారు రూ.150 చెల్లించి పుస్తకాన్ని పొందవచ్చని సూచించారు.