Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కలెక్టర్ ఇ శ్రీధర్
నవతెలంగాణ- నాగర్కర్నూల్
జిల్లాలో పనిచేసే అధికారులకు, ఉద్యోగులకు ఈ నెల 21నుంచి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఇ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ నేతృత్వంలో జిల్లా ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 23వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగ విధులు నిబంధనలు ప్రభుత్వ కార్యక్రమాలలో పద్ధతులు మరేతర అంశాలపై తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. 21న మధ్యాహ్నాం 2 గంటల నుంచి మొదటి బ్యాచ్లో అందరూ జిల్లా స్థాయి అధికారులు రెండవ స్థాయి అధికారులు డీఆర్ఓ , ఆర్డీఓలు , ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాల్టెక్నిక్, కళాశాల ప్రిన్సిపాల్కు ఈ శిక్షణుంటుందని తెలిపారు. 22న 9 గంటల నుంచి రెండో బ్యాచులో జిల్లాలోని అందరూ తహశీల్దార్ , ఎంపీడీఓలు, మండల విద్యాధికారులతో , మండల వ్యవసా యాధికారులతో పాటు తిమ్మాజిపేట , వెల్దండ, వంగూరు, మండలాలకు చెందిన అందరూ గెజిటెడ్ హెడ్ మాస్టర్లు ఉంటారని పేర్కొ న్నారు. 23 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మూడో బ్యాచులో అందరూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెసిడెన్షియల్ ప్రిన్సిపా ల్కు ఈ శిక్షణా తరగతులు ఉంటాయని తెలిపారు. స్థానిక నల్లవెల్లి రోడ్డులోని సాధన డిగ్రీ కళాశాలలో ఈ తరగతులు నిర్వహించను న్నట్టు తెలిపారు.