Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎ.రాములు
నవతెలంగాణ - బాదెపల్లి
సబ్బండ వర్గాల శ్రేయస్సు టీమాస్ ఫోరం ధ్యేయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎ.రాములు అన్నారు. శుక్రవారం జడ్చర్లలోని టీఎన్జీవో హాల్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అణగారిన, బడుగు, బలహీన వర్గాలు, బహుజనుల సంక్షేమం కోసమే టీమాస్ ఫోరం ఆవిర్భవించిందని చెప్పారు. ప్రజలందరూ కలిసొచ్చి తమ ఫోరంతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్.దీప్లానాయక్, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోలె జగన్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు, బహుజనుల సామాజిక అంశాలపై సుదీర్ఘ పోరాటాలు చేయాలనే సంకల్పంతో టీమాస్ ఫోరం ఏర్పడిందన్నారు.
ఈ నెల 20న మహబూబ్నగర్లో నిర్వహించనున్న టీమాస్ ఫోరం ఆవిర్భవ సభకు దళిత, సామాజిక, కార్మిక, కుల, వర్గ, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ నాయకులు నాగరాజు, బీసీ సబ్ప్లాన్ నాయకులు తెలుగు సత్తయ్య, కేవీపీఎస్ నాయకులు లక్ష్మయ్య, శంకర్, రాంచంద్రయ్య, కృష్ణ యాదవ్, సీఐటీయూ నాయకులు వెంకటేశ్, అంగన్వాడీ సంఘం నాయకురాలు అంజనమ్మ, ప్రభావతి, ఐద్వా నాయకురాలు లక్ష్మీదేవి, రజక సంఘం నాయకులు నడిమింటి శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు, సుధాకర్, వ్యకాస నాయకులు గద్దె శ్రీను, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు నిరంజన్, ఉదయమిత్ర నాయకులు యాదగిరి, ఓబీసీ నాయకులు బాలవర్థన్గౌడ్, తెలంగాణ రైతు సంఘం నాయకులు రాఘవేందర్ గౌడ్, రైస్మిల్ హమాలీ యూనియన్ నాయకులు దస్తగిరి, చెన్నకేశువులు పాల్గొన్నారు.