Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్వకుర్తి
మండల పరిధిలోని జీడిపల్లి గ్రామానికి చెందిన బాల్చందర్ అనే రైతు కుటుంబానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ శుక్రవారం అందజేశారు. బాల్చందర్ ఆరోగ్యం బాగాలేక కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపద్యంలో అతని కుటుంబానికి సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ.10వేల చెక్కును పంపిణీ ఎమ్మెల్సీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వరమ్మ, జెడ్పీటీసీ అశోక్రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్, టీఆర్ఎస్ నాయకులు చింతల రమణారెడ్డి, బన్నె శ్రీనివాస్యాదవ్, భీమ్లనాయక్, తదితరులు పాల్గొన్నారు.