Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్వకుర్తి
ఈ నెల 20వ తేదీన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సీఎన్రెడ్డి సదన్లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు జాగృతి సీనియర్ నాయకురాలు మిర్యాల పావణి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు కవి సమ్మేళనం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఇందులో పాల్గొనే వారు తెలంగాణ ఊరు, బాల్యం, జీవన విధానం, వృత్తులు, భాష సంస్కృతి, కళలు, ప్రకృతి అనే అంశంపై కవితలు రాయాల్సి ఉంటుందని సూచించారు. కవిత శుద్ధ్ద ప్రతిని రెండు కాపీలు సమర్పించాలని, ఒక్కో ప్రతిపై పాస్ ఫోటోను అతికించి రాయాలని తెలిపారు. కవిత ఒక్క పేజీకీ మించరాదని కోరారు. కవిత పఠనం మూడు నిమిషాలకు మించరాదని, కవి సమ్మేళనంలో చెప్పే కవితలను రాష్ట్ర స్థాయి సంచికలో ప్రచూరిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9959456826 అనే నెంబర్ను సంప్రదించాలని వారు పేర్కొన్నారు.