Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వంగూరు
సీపీఎస్ రద్దు విధానంపై ఉపాధ్యాయ సంఘాలు ఐక్యతతో ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గోవర్దన్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డీటీఎఫ్ ఉపాధ్యాయ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ... పాఠశాలలను, అంగన్వాడీలకు అనుసందానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయివేటు పాఠశాలలను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సెప్టెంబర్లో జరిగే జిల్లా మహాసభలకు ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి, నర్సింహులు, నాగార్జున్రావు, అంబయ్య, మోతిరామ్, లక్ష్మీనారాయణ, వెంకట్స్వామి పాల్గొన్నారు.