Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెల్దండ
ప్రజా విప్లవ కారుడు, గీత కార్మికుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని పురష్కరించుకొని మండల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెల్దండ బస్టాండ్ ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ జయంతి కార్యక్రమానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు మద్దతుగా నివాళిలో పాల్గొన్నారు. ప్రజా విప్లవ కారుడిగా వారి సమస్యలు పరిష్కరించిన పాపన్నగౌడ్ సమాజానికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజుగౌడ్, అధ్యక్షులు శ్రీను, కార్యదర్శి మట్ట విష్ణుగౌడ్, బీజేపీ నాయకులు రాఘవేందర్గౌడ్, శ్రీను, కాంగ్రెస్ మండలాధ్యక్షులు విజరుకుమార్రెడ్డి, హమీద్, శ్రీనివాస్యాదవ్, జంగయ్య, భిక్షపతి, ధర్మేందర్, గణేష్గౌడ్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
చారకొండలో...
మండల కేంద్రంలో శుక్రవారం సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ జయంతి వేడుకలను స్థానిక వివిధ సంఘాల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులు అర్పించి, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘాల నాయకులు మాట్లాడుతూ... సర్దార్సర్వాయి పాపన్నగౌడ్ తొలి బహుజన విప్లవ వీరుడని కొనియాడారు. తెలంగాణలో గోల్కొండ కోటను ఏలిన బహుజన నాయకుడని అన్నారు. రాష్ట్రంలో కట్టుదిట్టమైన 11 కోట్లలను నిర్మించారని గుర్తుచేశారు. ఆనాటి పరిస్థితుల్లో దశాబ్దన్నర కాలం పాలన కొనసాగించి, ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. సుస్థిరమైన పాలనను కట్టబెట్టిన ఘనత ఆయనదేనని, హిందు, ముస్లీం, గిరిజన తెగల వారిని సమాన నిష్పత్తితో చూసే వారని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు గురువయ్యగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాల్రాంగౌడ్, సవ్వారి జంగయ్య, గజ్జెయాదయ్య, జేసీబీ వెంకటయ్య, బాలస్వామి, నారయ్య, తదితరులు పాల్గొన్నారు.