Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోస్గి
జిల్లాలో వెనకబడిన కోస్గి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని మండల బీజేపీ నాయకులు వెంకటయ్య టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్-తాండూరు రహదారిపై సుమారు 2గంటల పాటు శుక్రవారం బీజేపీ నాయకులు, రైతులు దీక్షను చేపట్టారు. అనంతరం పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ... కోస్గి మండలంలో జూన్ నుంచి ఇప్పటి వరకూ వర్షపాతం తక్కువగా నమోదయిందని అన్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. వర్షాదారంపైనే ఆధారపడి జీవిస్తున్న మండల రైతులకు ప్రభుత్వం వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి ఎస్సై కృష్ణయ్య చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో బీజేపీ నాయకులను పై అధికారులతో మాట్లాడించి నిరాహార దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటయ్య, రమేష్, నారాయణ, కిరణ్కుమార్, శ్రీకాంత్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.