Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెడ్యూల్ కులాల పరిరక్షణా సమితి
రాష్ట్ర అధికారి వెంకటేష్
నవతెలంగాణ-గండ్వీడ్
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి కామారం వెంకటేష్ తెలిపారు. మండల పరిధిలోని సల్కర్పేట్ గ్రామంలో షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి మండల కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ రోజుల్లో చాలా మంది దళితులు క్రైస్తవులుగా మారుతున్నారని పేర్కొన్నారు. దీని వల్ల షెడ్యూల్ కులాలకు వచ్చే లాభాలను కోల్పోయి బీసీ-సీగా గుర్తింపు పొందుతారని తెలిపారు. అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా పక్కీరయ్య, అధ్యక్షులు దానయ్య, కార్యదర్శి మొగులయ్య, ప్రచార కార్యదర్శి వెంకటయ్య, 24మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రమేష్, కార్యదర్శి కృష్ణయ్య, మండలాధ్యక్షుడు వెంకటయ్య, కన్వీనర్ చెన్నయ్య, ప్రచార కార్యదర్శి వివేకానంద్, కృష్ణయ్య, మొగులయ్య, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.