Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండ్వీడ్
విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అహ్మదాబాద్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో విశ్వ భారతి కళాశాలలో ఫ్రెషర్స్డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలన్నారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని భవిష్యత్తులో పోటీ పరీక్షలకు తగిన విధంగా తయారుకావాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వభారతి విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి సుదర్శన్రావు, కళాశాల అధ్యాపక సిబ్బంది, నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.