Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోస్గి
తన భర్త చనిపోయి 15ఏండ్లయినా పింఛన్ రావడం లేదంటూ కలెక్టర్ రొనాల్డ్ రోస్కు మండల కేంద్రానికి చెందిన మహిళ పిట్టల వెంకటమ్మ శుక్రవారం వేడుకుంది. కోస్గి మండలంలోని బిజ్జారం గ్రామానికి చెందిన పిట్టల వెంకటమ్మ భర్త కిష్టయ్య 15 కింద చనిపోయాడు. పింఛన్ కోసం వెంకటమ్మ అధికారుల చుట్టూ తిరిగినా వారు పట్టించుకోలేదు. దీంతో వెంకటమ్మ మండలకేంద్రానికి వచ్చిన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. కలెక్టర్ స్పందించి గ్రామంలోని పంచాయతీ సెక్రెటరీ, వీఆర్ఓ, సర్పంచ్లతో మాట్లాడారు. వచ్చే నెల నుంచి పింఛన్ అందే విధంగా చూడాలని ఎంపీడీఓను ఆదేశించారు.