Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సబ్ప్లాన్ సాధన సమితి రాష్ట్ర
ఉపాధ్యక్షుడు ఏపీ.మల్లయ్య
నవతెలంగాణ-కల్వకుర్తి
300 సంఘాలతో టీమాస్ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుందని బీసీ సబ్ప్లాన్ సాధన సమితీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ. మల్లయ్య అన్నారు. నాగర్కర్నూల్లో ఈ నెల 20న జరిగే టీమాస్ జిల్లా సదస్సు పోస్టర్ను బీసీ సబ్ప్లాన్ సాధన సమితీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని టీఎస్యూటీఎఫ్ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ.మల్లయ్య మాట్లాడుతూ... నాగర్కర్నూల్లో జరిగే ఈ సదస్సుకు గద్దర్తో పాటు పలువురు ప్రముఖ నాయకులు, ప్రజా సంఘాలు, పాల్గొంటారని తెలిపారు. ఈ జిల్లా సదస్సులో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సబ్ప్లాన్ సాధన తాలూకా అధ్యక్షుడు రాజేంధర్, జేఏసీ కన్వీనర్ సదానందం, సీఐటీయూ నాయకులు అంజనేయులు, కానుగుల జంగయ్య, మధనమురళీ, భాస్కర్, రిటైర్డ్ హెచ్ఎంల సంఘం నాయకులు అంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
చారకొండలో...
బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, రాజకీయం గా అభివృద్ధి చెందటమే లక్ష్యంగా టీమాస్ సభ నిర్వ హించనున్నట్టు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బాల స్వామి అన్నారు. ఈ నెల20వ తేదీన నాగర్ కర్నూల్లో నిర్వహించబోయే టీమాస్ ఫోరం సదస్సు పోస్టర్ను ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... ఈ సభకు గద్దర్, తమ్మినేని వీరభద్రం, విమలక్క, జాన్వెస్లీ, కంచె ఐలయ్య, తదితరులు హాజరవుతారని వారు తెలి పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి విస్తృతమై న ప్రసంగం ఉంటుందని తెలిపారు. మండలం లోని అన్ని గ్రామాల్లో ప్రజలందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం కార్యదర్శి సత్యం, గౌడ సంఘం నాయకులు శంకర్గౌడ్, రజక సంఘం నాయకులు వెంకటయ్య, నారయ్య, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.