Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి : శ్రీను యాదవ్
నవతెలంగాణ-పదర :
ప్రతిభ గల గ్రామీణ, మారుమూల ప్రాంత క్రీడాకారులను వెలికి తీస్తామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి ఎడ్మ శ్రీను యాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని వివేకనంద చౌరస్తా వద్ద సర్పంచ్ రాయ శ్రీనివాసులు, సీనియర్ క్రీడాకారులు, గ్రామస్తులు, వివిధ పార్టీ నాయకులు శాలువతో శుక్రవారం ఆయనను సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నల్లమల మారుమూల ప్రాంతంలో ఎంతో మంది ప్రతిభ ఉన్న క్రీడాకురులు ఉన్నారని తెలిపారు. వారికి సరైన ప్రోత్సహం అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా బాధ్యతలు అప్పగించిన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. రాబోవు రోజుల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధ్యక్షునిగా ఎన్నిక కావడం ద్వారా మారుమూల ప్రాంత క్రీడాకారులకు సరైన న్యాయం జరుగుతుం దన్నారు. నల్లమల ప్రాంతానికి చెందిన జాతీయ స్థాయి క్రీడాకారునికి అరుదైన అవకాశం రావడం పట్ల సీనియర్ క్రీడాకారులు బిక్షపతి యాదవ్, కార్తీక్ గ్రామస్తులు, గోలి శ్రీనివాసులు, తిమ్మసాని వెంకటయ్య, మండి లింగయ్య, జబ్బు ఎల్లయ్య, నీలం బాలరాజు, జీటి యాదవ్, సత్యనారి, శేఖర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ డ్యాగ అనిల్, శేఖర్, యాదగిరి, రాజు, శివాజీ హర్షం వ్యక్తం చేశారు.