Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పెంట్లవెల్లి
మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాలను జిల్లా అగ్రికల్చర్ బృందం శుక్రవారం తనిఖీ చేశారు. మండల ఏడీఏ రవికుమార్ కల్వకుర్తి ఏడీఏ శ్రీనివాస రాజు, బృందం సభ్యులతో కలిసి రామకృష్ణ ఏజెన్సీ సత్యనారాయణ సన్స్ ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. నాణ్యమైన సరుకులు అమ్ముతున్నారా లేదా అని యజమానులను ఆరాతీసి రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో బృందం సభ్యులు ఏఓ నరేష్, థన్రాజ, మంజుల, పాల్గొన్నారు.