Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అచ్చంపేట
రాజ్యసభలో ఎస్సీ వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదని తేల్చేసిన కేంద్ర సామాజిక మంత్రి విజరు సంప్లా ప్రకటన పట్ల తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్కుల శ్రీశైలం శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం లోని నిబంధన 341 ప్రకారం 29 రాష్ట్రా లలోని ప్రభుత్వాలు, పార్లమెంట్లో 3/2 వ వంతు మెజార్టీతో అంగీకరించాల్సి ఉంటుందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత దూర దృష్టి తో 341 ఆర్టికల్ ను పొందుపర్చారని పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చెల్లదని 2007 లోనే తేల్చేసినట్టు పేర్కొన్నారు. వర్గీకరణ పేరుతో దళితులను విడాదీయాలని ప్రయత్నాలు చేయడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకటనలో శ్యామ్, వెంకటస్వామి, సూరయ్య లు ఉన్నారు.