Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాల :
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యంగ్లీడర్స్, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ పోటీలో గెలుపొందిన జట్టుకు శుక్రవారం పార్టీ రాష్ట కన్వీనర్ సీతారాంరెడ్డి చేతుల మీదుగా బహుమానం అందజేశారు. ప్రథమ బహుమతి లయన్ టీంకు రూ. పదివేలు, రెండో బహుమతి రూ. ఐదు వేలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీతారాంరెడ్డి మాట్లాడుతూ... క్రీడల ద్వారా విద్యార్థులకు, యువకులకు శారీరకంగా, ఉల్లాసంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రమేష్రావు, మండల నాయకులు అశోక్, మహేశ్వరం, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.