Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోస్గి
60 రోజుల కార్యచరణలో ట్రిబుల్ ఆర్ విధానాన్ని వందశాతం సాధించేదుంకు కృషి చేయాలని మండల క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడు నారాయణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కడంపల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో ట్రిబుల్ ఆర్ అమలు విధానాన్ని ఆ బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... మూడు నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో తెలుగు, ఆంగ్లం ధారళంగా చదవడం, రాయడం వంటి అంశాలని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేందర్రావు, మానిటరింగ్ బృందం సభ్యులు బాల్రాజ్, ఉపాధ్యాయుడు వెంకటయ్య, సిద్ధప్ప, వెంకటేష్, నిర్మల, ఇందిరా, స్వప్న, నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.