Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పంచాయతీరాజ్ శాఖ
అధికారి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కోస్గి
గ్రామ పంచాయతీల్లో రికార్డులను ఎప్పుటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం మండల మేజర్ గ్రామ పంచాయతీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని టాక్స్ విధానాలు, పన్ను వసూలు, లేఔట్ల వివరాలు, ఇండ్ల అనుమతుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మీసేవాలో దరఖాస్తు చేసుకున్న జనన, మరణ ధృవీకరణ పత్రాలను 21రోజుల అనంతరం అందజేయాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీలోని రికార్డులతో పాటు 14వ ఆర్థిక సంఘం నిధుల వివరాలన్నీంటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చే ఎన్నిక్కల్లో మేజర్ గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేసే అవకాశం ఉందన్నారు. మండలంలో 25వేల వరకు జనాభా ఉండటంతో పాటు 12వేల వరకు ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ సద్గుణ, పంచాయతీ కార్యదర్శి అనురాధ, సర్పంచ్ శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.