Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్నాయక్
నవతెలంగాణ-అచ్చంపేట
తపాలా ఉద్యోగులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వీడాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్నాయక్ డిమాండ్ చేశారు. తపాల ఉద్యోగులకు కమలేశ్ చంద్ర కమిటీ రిపోర్టును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తు చేపట్టిన సమ్మె శుక్రవారంతో మూడో రోజుకు చేరుకుంది. ఈ సమ్మె కు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆయన మాట్లాడారు. కమలేష్ చంద్ర కమిటీ రిపోర్టును తక్షణమే అమలు చేయాలన్నారు. జీడీఎస్ల పని గంటలను 8 గంటలుగా గుర్తించాలని, సివిల్ సం్వంట్ హోదా కల్పించాలని, ఢిల్లీ మద్రాస్ సీఏటీ ల తీర్పు లకు అనుగుణంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా టార్గెట్ల పేరుతో తపాల ఉద్యోగులను వేధించడం సరైనది కాదన్నారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి నేడు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కారం, హక్కుల సాధన కై చేపట్టిన సమ్మెకు తమ మద్దతు ఉంటుందని గుర్తు చేశారు. కావునా ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమ్మెలో వనపర్తి డివిజన్ ఉపాధ్యక్షులు పురుశోత్తంరెడ్డి, ముస్తఫా లతో పాటు అచ్చంపేట, లింగాల, ఉప్పునుంతల మండలాల తపాల ఉద్యోగులు జహంగీర్, వెంకటయ్య, రాజేశ్వర్రెడ్డి, ప్రవీన్, తిర్పతయ్య, దేవెందర్, ఈశ్వరయ్య, ఖలీల్, కురుమూర్తి, రాము, బాలాజి, బచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
పెంట్లవెల్లి :
మండలంలోని గ్రామీణ తపాల కార్యాలయం ముందు గ్రామీణ తపాల ఉద్యోగులు నిరవధిక సమ్మె శుక్రవారం కూడా కొనసాగింది. వారి డిమాండ్లు నెరవేరడం కోసం ఆలిండియా బ్యాంక్ సేవా యూనియన్ నాయకులు సయ్యద్పాష మాట్లాడు తూ... తపాల ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని వారు కోరారు. కమలేష్ చంద్ర కమిటి రిపోర్టులు వెంటనే అమలు పర్చాలి.టార్గెట్ల పేరుతో వేధించడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్, గప్ఫర్, కిషోర్, అస్ముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.