Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సాగర్
- క్రమశిక్షణ కల్గిన నాయకున్ని కోల్పోయాం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు
నవతెలంగాణ-నారాయణపేట
సీపీఐ(ఎం) నాయకులు చంద్రశేఖర్ మృతి పార్టీకి తీరని లోటని పార్టీ రాష్ట్ర నాయకులు సాగర్, మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి ఏ.రాములు అన్నారు. చంద్రశేఖర్ నాగర్కర్నూల్ నుంచి మహబూబ్నగర్కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా క్లూజర్ ఢ కొట్టడంతో మృతి చెందాడు. మండల కేంద్రంలోని కొనుకొంట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఆయన అంత్య క్రియలకు సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సాగర్, జిల్లా కార్య దర్శి ఎ.రాములు, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ రాం రెడ్డి, దామ రగిద్ద మండల కన్వీనర్ గోపాల్, నారా యణపేట మండల కన్వీనర్ బలరాంలు హా జరయ్యారు. అనం తరం రెం డు నిమిషాలు మౌ నం పాటి ంచి కుటుంబ సభ్యు లను పరమార్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చంద్రశేఖర్ మంచి నిబద్దత కలిగిన వాడని పుట్టుకతోనే నీతి నిజాయితీతో సమస్యలపై పోరాడేవారని కొనియాడారు. ఆయనకు నాలుగు నెలల క్రితమే వివాహమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియల్లో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు బాలప్ప, నాయకులు కాశప్ప పాల్గొన్నారు.