Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కింగ్ ఓవైపు...తవ్వకాలు మరో వైపు
- ఇండ్లు కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్
నవతెలంగాణ- బిజినపల్లి
మండల పరిధిలోని మంగనూరు గ్రామం లో చేపడుతున్న మిషన్భగీరథ పనులు నిబం ధనలకు విరుద్ధంగా ఉన్నాయని శుక్రవారం గ్రామస్తులు పనులను అడ్డగించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాటా ్లడుతూ.. కొందరు అమాయకుల ఇండ్లను కూల్చేసిి పైపు లైన్లు వేస్తున్నారని, కొన్ని చోట్ల మార్కింగ్ ఒక వైపు ఉన్నా మరో వైపు కాల్వలు తవ్వుతున్నారని ఆరోపించారు. ఆర్అండ్బీ రోడ్ను ధ్వంసం చేసి కాల్వలను తవ్వుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మంగనూరు చౌరస్తా వద్ద గ్రామస్తులైన చిన్న రామ్ రెడ్డి, సిద్దయ్య, సత్యమ్మలకు చెందిన ఇండ్లను ధ్వంస ం చేసి కాల్వను తీశారని ఆందోళన వ్యక్తం చేశా రు.అదే వరుస క్రమంలో ఉన్న కొందరి డబ్బా లు తొలగించి మార్కింగ్ చేసి అదే రోజు మార్కి ంగ్ను మార్చి
మెయిన్ రోడ్ ధ్వంసం అయ్యే విధంగా కాల్వను తవ్వుతున్నారని ఆరోపిస్తున్నారు. అలా చేయడం వల్ల గ్రామంలోకి వెళ్లే తాగు నీళ్ల పైపులైన్లు, గేట్ వాల్ ధ్వంసమై గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందించి ఎస్టిమేషన్లో ఉన్న విధంగా కాల్వలు తవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.