Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల టార్గెట్ రూ.పది లక్షలు
-12 ఏండ్లుగా చాలీచాలని వేతనాలు
-పాలకులు మారినా బతుకులకు గుర్తింపు లేదు
-నిరవధిక సమ్మెలోకి మండల సమాఖ్యలు
మహిళలు చిల్లర డబ్బులను ప్రభుత్వ ఖజానాలో దాచుకోవడానికి వెలుగు, ఇందిరా క్రాంతి, మహిళా సమాఖ్యల పేర్లతో ప్రభుత్వం గ్రూపులను ఏర్పాటు చేసింది. ఈ పథకంలో భాగంగా రూ.వేల నుంచి కోట్ల వరకు ప్రభుత్వ ఖాతాలో చేరుతున్నాయి. రేయింబవల్లు పని చేస్తున్న ఉద్యోగుల శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ప్రభుత్వం కల్పించడం లేదు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని మూసేయడానికి ప్రయత్నాలు చేస్తోందనే సమాచారం వినబడుతోంది. దీంతో ఆందోళన మొలై హక్కుల కోసం మండల సమాఖ్యలు సమ్మెకు పూనుకున్నారు.
నవతెలంగాణ-మహబూబ్నగర్
ప్రజల సంపదను ప్రభుత్వం ఎలా దోచు కోవాలనే ఆలోచననే మహిళా సంఘాలు. గ్రామీణ ప్రాంతంలోని కూలీ నాలీ చేసుకుని సంచుల్లో దాచుకున్న చిల్లరపై పాలకుల కన్ను పడింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం మహిళల ను లక్షాధికారులను చేస్తామని గ్రామాలు, ప ట్టణాల్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేసిం ది. అప్ప ట్లో జిల్లాలో వెలుగు సంస్థ విస్తృతం గా మహిళా గ్రూపులను ఏర్పాటు చేసింది. జిల్లాలోని గ్రామాల్లో వార్డుల వారిగా చిన్న చిన్న మహిళా సంఘాలు 17,912 ఉన్నాయి. ఈ సంఘాల్లో 12 నుంచి 15మంది వరకు మహిళలు ఉంటారు. గ్రామ సంఘాల్లో 18 నుంచి 30మంది ఉంటారు. ఈ సం ఘాలు జిల్లాలో 819 ఉన్నాయి. మహిళా సంఘాల సభ్యుల నుంచి ప్రతి నెలా డబ్బులు వసూలు చేయడం, రుణాలు ఇప్పించడం, తీసుకున్న రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించే విధంగా చూడడం కోసం ప్రభుత్వం మండల సమాఖ్యలను ఏర్పాటు చేసింది. వీటి పరిధిలో జిల్లాలో 75మంది ఉన్నారు. వీరందరూ మండల సమాఖ్య సభ్యులుగా, అకౌంటెంట్స్, కంప్యూ టర్ ఆపరేటర్స్గా పని చేస్తున్నారు. వీళ్లు గ్రామాల్ల్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వారు, ప్రభుత్వ అధికారులు చెప్పిన పనులను చేస్తుంటారు. ప్రభుత్వ ప్రగతి కోసం మండల సమాఖ్యలు నిరంతరం పని చేసినా కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదు. కార్మిక చట్టం ప్రకారం నెలకు రూ.18,000లు ఇవ్వాలని ఉన్నా వీరికి రూ.6000లు కూడా ఇవ్వడం లేదు. అది కూడా బిజినెస్ ఉన్న మండలాల్లో మాత్రమే ఉద్యోగులకు నెల జీతం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికీ నెల టార్గెట్ రూ.పది లక్షలు ఉంటుందని మండల సమా ఖ్యలు అంటున్నారు. దీంతో పాటు గ్రామాల్లో స్త్రీ నిధి ఫింఛన్లు, అభయ హస్తం పింఛన్లు, చనిపోయిన వారికి బీమా సౌకర్యం లాంటివి రెగ్యూలర్గా వీళ్లే పంపీణీి చేస్తారు. 2000 సంవత్సరం నుంచి రాష్ట్రంలో వీళ్లని మండల సమాఖ్యలుగా పిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తంలో 60 ఏండ్లు నిండిన మహిళలకు నెలకు రూ.500 చొప్పున పింఛన్ పేరుతో మహిళల నుంచి రూ. కోట్లు ప్రభుత్వ ఖాజాలో జమైనాయి. ఆరు నెలలుగా జిల్లాలో పూర్తిగా అభయ హస్తం ఆగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశ పట్టిన ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలో మూసేయ డానికి ప్రయత్నం జరుగుతోందనే వినబడుతోంది. ప్రభుత్వాలకు ఓటు బ్యాంక్గా మారిన మహిళా సంఘాలు, ప్రభుత్వానికి ఎంతో సేవ చేస్తున్నాగానీ మాకు ఉద్యోగ భద్రత లేదని మండల మహిళా సమాఖ్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 ఏండ్లుగా కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు లేకున్నా కంప్యూటర్, పుస్తకాల ఆధారంగా పని చేయడంతో ఛాతినొప్పి, నరాల సమస్యలు, కంటి చూపు మందగించడం లాంటి రోగాల బారిన పడినాగానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు బాధ పడుతున్నారు. మూడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవి ంచినా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా జరు గుతున్న సమ్మెలో మేమూ పాల్గొంటున్నట్టు వారు ప్రకటించారు. మమ్ముల్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని, కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని, ఆరోగ్య భద్రత, ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు కల్పించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని పలు డిమాండ్స్తో పరిష్కారం లభించే వరకూ సమ్మె చేస్తామని మండల సమాఖ్య వారు వాపోతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి...
జిల్లాలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో 12 ఏండ్లుగా పని చేస్తున్నా. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించాలి. కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలి.
ఎమ్డీ.ఫారుఖ్, మండల స్థాయి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన
ప్రసూతి సెలవులివ్వాలి
జిల్లా వ్యాప్తంగా మహి ళా సంఘాలల్లో పని చేస్తున్న వారు ఎక్కువనే ఉన్నారు. మాకూ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులివ్వాలి. ఇ న్సూరెన్స్ సౌకర్యం, హెల్త్కా ర్డులు ఇవ్వాలి.
-కవిత జిల్లా కోశాధికారి, మండల స్థాయి ఉద్యోగుల సంక్షేమ సంఘం