Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి/ మహబూబ్ నగర్ కలెక్టరేట్
మహబూబ్ నగర్ జిల్లా సీపీఎం కార్యదర్శి ఏ రాములు సతీమణి ఐద్వా జిల్లా కార్యదర్శి అరు ణ సోమవారం సాయంత్రం హైదరాబాదు లోని కిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మతి చెందారు. ఆమె మతితో జడ్చర్ల నియోజక వ ర్గం మిడ్జిల్ మండలం వాడాల గ్రామంలో వి షాదఛాయలు అలముకున్నాయి. గతంలో సీపీఎం పార్టీ నుంచి గ్రామ సర్పంచిగా ఎన్నికై ఎన్నో సంక్షేమ అభివద్ధి పనులు చేపట్టారని, గ్రామాభివృద్ధి కోసం పలు పనుల మంజూరు చేయించేందుకు ఆమె పోరాటం చేశారని ప్ర జలు చర్చించుకున్నారు. ఆమె మతి పట్ల పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతా పం ప్రకటించారు. ఆమె మతి పట్ల వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్, నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి పర్వతాలు, గద్వాల జిల్లా కార్య దర్శి వెంకటస్వామి, నారాయణపేట జిల్లా కా ర్యదర్శి వెంకట్రాంరెడ్డి, వేర్వేరుగా సంతాపం ప్రకటించారు. అలాగే నవతెలంగాణ బ్రాంచ్ మేనేజర్ కార్తిక్, ప్రాంతీయ ప్రతినిధి పరిపూ ర్ణం, డెస్క్ ఇన్చార్జి నాగేశ్వరరావు, సబ్ ఎడిట ర్లు శ్రీనివాస్యాదవ్, తిప్పన్న సంతాపం వ్యక్తం చేశారు.
అరుణ మతి పార్టీకీతీరని లోటు
-సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్
సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ. అరుణ మతి పార్టీకి తీరని లోటు అని సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్ ఆవేదన వ్యక్తం చేశా రు. అరుణ మతి పట్ల సో మవారం సీపీఎం జిల్లా కా ర్యాలయంలో జరిగిన స మావేశంలో ఆయన మా ట్లాడారు. మహిళా సంఘం లో పనిచేస్తూ మహిళల హ క్కుల కోసం, మహిళల సమస్యల పైన ఎన్నో ఉద్యమాలు చేశారని తెలిపారు. మహిళల సమస్యల పై, కష్ట జీవుల సమస్యల పరిష్కారానికి అరుణ పలు ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. అరుణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంగళవారం ఉదయం 11 గం టలకు మిడ్జిల్ మండలం లోని వాడియాలా గ్రామంలో అం త్యక్రియలు జరగనున్నా యి. సమావేశంలో సీపీఐ (ఎం) మహబూబ్నగర్ జి ల్లా నాయకులు నల్లవెల్లి కు రుమూర్తి, చంద్రకాంత్, తె లంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షులు ఖమర్ ఆ లీ, సీఐటీయూ, కేవీపీఎస్ రైతు, వ్య వసాయ, కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాల నాయకులు లు వీరాం జనేయులు, తిరుమలయ్య కురుమయ్య కురుమూర్తి, రాజ్ కుమార్ ప్రశాంత్ సురేష్ విష్ణు పాల్గొన్నారు.