Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- కొత్తకోట
హరితహారాన్ని పండగలా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 6వ విడత హరితహారం కార్యక్ర మంలో భాగంగా మంగళవారం కొత్తకోట మండల పరిధిలోని ఈదులా బావి తండాలో అవెన్యూ ప్లాంటేషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతిపల్లె, పట్టణంలో మొక్కలు నాటి తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంలా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని, ఇందుకు మనమంతా మద్ద తు తెలిపి హరిత సైనికుల్లా మొక్కలు నాటి,ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, ఎంపీడీఓ శ్రీపాద, సింగిల్ విండో చైర్మన్ వంశీ చందర్ రెడ్డి, నాయకులు జగన్ మోహన్ రెడ్డి, బాల నారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.