తమిళనాడు : తిరునల్వేలి జిల్లా కళాక్కడ్ సమీపంలోని కీలపతాయి పండితంకురిచి ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఓ దారుణం వెలుగులోకొచ్చింది. దళిత విద్యార్థులతో 8 నెలలుగా బలవంతంగా మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి కారకులైన 8 మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గత ఎనిమిది నెలలుగా టీచర్లు దళిత విద్యార్థులతో పాఠశాల మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారు. 20 రోజుల కింద ఈ విషయం బయటికి రావడంతో వామపక్షాల నేతలతో పాటు పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో దళితులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం 8 మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఉపాధ్యాయుల పేర్లు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. కాగా, 6 నుంచి 8వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థులతో పాఠశాల సమయంలోనే బలవంతంగా మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్నారని పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.మరుగుదొడ్లను శుభ్రం చేయనట్లయితే తీవ్రంగా కొడతామని కూడా ఆ విద్యార్థులను టీచర్లు బెదిరించినట్లు ఆరోపించారు. మరుగుదొడ్లు శుభ్రం చేయించడంతో ఓ విద్యార్థి పాఠశాలకు కూడా వెళ్లడం మానేశాడని నాయకులు తెలిపారు. వామపక్షాల పార్టీల నేతలు, దళిత సంఘాలు ఆందోళనలతో స్పందించిన జిల్లా కలెక్టర్.. నేరం రుజువైతే నిందితులైన టీచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Authorization